ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్ వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు

0
112

*ప్ర‌చుర‌ణార్థం* *30-12-2025*

 

 

షాబుఖారి బాబా దర్గా మహోన్నతమైనది : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

 క‌లిసి ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే వ‌సంత 

 

 

ఇబ్రహీంపట్నం: కుల, మతాలకు అతీతంగా నిర్వహించే షాబుఖారి బాబా దర్గా ఉరుసు ఎంతో మహోన్నతమైనదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. కొండపల్లిలొని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 429 వ ఉరుసు మహోత్సవాలకు మంగ‌ళ‌వారం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్, టిడిపి జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చెన్నుబోయిన చిట్టిబాబు ల‌తో కలిసి పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బాబా ఆశీస్సులు పొందారు. ఆ త‌ర్వాత భ‌క్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన షాబుఖారీ బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనటం చాలా ఆనందంగా వుందన్నారు. ఉరుసు మహోత్సవానికి ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ స‌హ‌కారంతో భ‌క్తుల ఏటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారని ప్రశంసించారు. ప్రతిరోజు భక్తులందరికీ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్య‌క్ర‌మం టిడిపి కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి జంపాల సీతారామ‌య్య‌, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ అక్క‌ల గాంధీ, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పైజాన్ ల‌తోపాటు ఎన్డీయే కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల–చిలకలూరిపేట మార్గంలో టోల్ ప్లాజా ప్రారంభం – వాహనదారులకు సూచన
చీరాల నుంచి చిలకలూరిపేటకు వెళ్లే మార్గంలో పర్చూరు సమీపంలో ఉన్న టోల్ ప్లాజాను ఈరోజు...
By Vadlamudi NagaVenkat 2026-03-06 04:21:34 0 281
Maharashtra
सराफा बाजारात सोन्याचे दर वाढले, खरेदीदार चिंतेत
नाशिकसह राज्यातील #सराफा बाजारात १४, १८, २२ आणि २४ कॅरेट #सोन्याचे दर सतत वाढत आहेत. मागील काही...
By Pooja Patil 2025-09-13 05:21:36 0 159
Andhra Pradesh
ప్రజా దర్బార్ లో సమస్యలు విన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష.
మదనపల్లెలో సోమవారం జరిగిన ప్రజా దర్బార్ లో స్థానిక ప్రజలు తమ సమస్యలను మదనపల్లి శాసనసభ్యులు యం....
By Pagadala Venkateswar 2026-03-02 07:53:29 0 87
Bharat Aawaz
Article 11 – Citizenship Laws Are in the Hands of Parliament
What Is Article 11 All About? While the Constitution (Part II) talks about who is a...
By Citizen Rights Council 2025-06-26 12:56:38 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com