సుచిత్ర ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఎంపీ ఈటెల.|

0
147

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : సుచిత్ర సెంట్రల్ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు.

కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన రైల్వే స్టేషన్ మొదలు పెట్టి సంవత్సరన్నర అయినా నిరుపయోగంగా మారడం పట్ల ఎంపి. ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ స్టేషన్ పూర్తి స్థాయిలో ప్రజలకు వినియోగంలోకి రావడానికి ఏం చేయాలో నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇక్కడ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉందని ప్రజలకు తెలియకపోవడం. బస్ స్టేషన్ చాలా దూరం ఉండడం. స్టేషన్ కి రావడానికి సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఎక్కువమంది ప్రయాణికులు రావడం లేదని అధికారులు వివరించారు. 

 

చర్లపల్లి - ఘట్కేసర్, 

లింగంపల్లి - రామచంద్రపురం,

రెండు రూట్లలో రైళ్లు నడుస్తున్నాయి.

ఈ మార్గంలో రైళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా పెంచాలని ఉన్నత అధికారులను కోరతామని ఈటల రాజేందర్ తెలిపారు.

 

ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు సదా కేశవ రెడ్డి ,చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ, మల్ల రెడ్డి,భరత్ సింహ రెడ్డి, సుబ్బా రావు, రాజి రెడ్డి , మల్లికార్జున్ సూర్య, మురళి కృష్ణ, శ్రీధర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
కోడుమూరు పట్టణం ప్రజలంతా సంకటితమై ఈ దేశం నుండి బిజెపి పార్టీని సాగనంపాలని
కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అనంతరత్నం మాదిగ   ఏఐసిసి & ఏపీసీసీ...
By mahaboob basha 2025-09-29 10:30:19 0 273
Andhra Pradesh
సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా పూర్తయింది.
సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:49:37 0 439
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: పోలీసుల స్పెషల్ వీడియో
అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...
By Pagadala Venkateswar 2026-03-07 09:24:08 0 112
Telangana
తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్    మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...
By Sidhu Maroju 2025-08-06 08:11:31 0 776
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com