రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే!! కర్నూలు జిల్లా ఎస్పీ

0
166

కర్నూలు: పత్రికా ప్రకటన  (23.12.2025)

50 సార్లు రక్తదానం చేసిన కర్నూలు టు టౌన్  కానిస్టేబుల్ చిన్న సుంకన్న

అభినందించి శాలువతో సన్మానించిన... కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు. 

రక్తదానం... ప్రాణ దానంతో సమానం... సేవా భావంతో పని చేయడం అభినందనీయం...జిల్లా ఎస్పీ

రక్తదానం చేయడం అంటే  ప్రాణదానం చేయడం లాంటిదని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు. 

కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న  చిన్న సుంకన్న  50  సార్లు  రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడంతో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం అభినందించారు. 

శాలువ , పూల మాలతో సన్మానించారు. జ్ఞాపికను అందజేశారు. 

పోలీసు శాఖలో  విధులు నిర్వహిస్తూ , సేవాభావంతో  రక్తదానం చేయడం  అభినందనీయమని జిల్లా ఎస్పీ  గారు  కొనియాడారు.

2011 బ్యాచ్ కు చెందిన పోలీసు కానిస్టేబుల్. స్వస్ధలం కర్నూలు , బుధవారపేట . 

ఈయన కర్నూలు జిల్లాతో పాటు పక్క జిల్లాల నుండి ఎవరైనా అత్యవసర సమయములలో పోలీసులకు ,ప్రజలకు, గర్భవతులకు వివిధ సమస్యలతో హాస్పిటల్స్ చేరిన వారికి  వెంటనే స్పందించి రక్తదానం చేయడమే కాక అనేక మందిని రక్తదాతలుగా ప్రోత్సహించారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, కర్నూలు డిఎస్పీ  బాబు ప్రసాద్ , కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు ఉన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో పంటల మార్పిడి మార్పిడి అత్యవసరం
తెలంగాణలో పంటల మార్పిడి అత్యవసరమని రైతు కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏటా వరి...
By Ponnala Srinivasrao 2026-05-06 04:20:13 0 90
Telangana
పేసా చట్టాన్ని బలోపేతం చేయాలి
కొత్తగూడ,డిసెంబర్ 24(భారత్ అవాజ్)::పేసా చట్టం మహోత్సవన్ని పురస్కరించుకొని ఆదివాసీ ప్రజా సంఘాల...
By Bittu Bittu 2025-12-24 13:59:21 0 348
Andhra Pradesh
Breaking news 🗞️:-మళ్లీ తప్పని యుద్ధ తిప్పలు🥵
ఇప్పటికే గత నాలుగు వారాల నుంచి జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల వ్యాప్తంగా...
By Thokala Sivaji 2026-03-26 03:55:40 0 672
Andhra Pradesh
రంపచోడవరం ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి పర్యటన
*For scrolling*   *అల్లూరి సీతారామరాజు జిల్లా**:   రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్...
By Rajini Kumari 2025-12-21 14:07:46 0 212
Andhra Pradesh
పుంగనూరు: రౌడీ షీటర్ దారుణ హత్య
పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డిజే. భాస్కర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో...
By Kothuru Murali 2026-02-11 08:40:19 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com