బైరం చెరువుకు రక్షణ కవచం నిర్మించాలి- ప్రజావాణిలో వినతి.|

0
190

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బాచుపల్లి పరిధిలోని బైరం చెరువు (పెద్ద చెరువు) ఆధునీకరణ, సుందరీకరణ పనులను హెచ్ఎండిఏ ద్వారా వేగవంతం చేయాలని, చెరువు కట్ట పటిష్టతకు తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆమె అధికారులకు వినతి పత్రం సమర్పించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత వర్షాకాలంలో బైరం చెరువు కట్ట తెగిపోవడంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అప్పట్లో తృటిలో ప్రాణ, ఆస్తి నష్టం తప్పిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ముందుస్తు చర్యలు చేపట్టాలని కోరారు.

బంద్ నిర్మాణం, స్టోన్ పిచ్చింగ్, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ వేసవిలోనే యుద్ధ ప్రాతిపదికన చెరువు చుట్టూ పటిష్టమైన బంద్ నిర్మించాలని, దానికి స్టోన్ పిచ్చింగ్ (రాళ్లతో పేర్చడం) ద్వారా రక్షణ కల్పించాలని సూచించారు. చెరువు యొక్క ఇన్-లెట్స్ (నీరు వచ్చే దారులు) అవుట్-లెట్స్ (నీరు వెళ్లే దారులు)ను ఎస్.ఎన్.డి.పి నాళాలకు అనుసంధానం చేయాలని కోరారు. తద్వారా అదనపు నీరు నివాస ప్రాంతాల మీదకు రాకుండా నేరుగా నాళాల ద్వారా వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు దాసి నాగరాజ, బీజేపీ జిల్లా నాయకులు రచ్చ చక్రధర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం, హెచ్ఎండిఏ అధికారులు ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థి మృతి
తమిళనాడులోని మధురైలో బీటెక్ చదువుతున్న పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన ధరణి అనే...
By Kothuru Murali 2026-04-18 09:36:26 0 172
Andhra Pradesh
3వ రోజు ఆట ల పోటీలు
 విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల...
By Mobbu Venkatramana 2026-03-09 10:31:54 0 264
Telangana
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్...
భారత్ అవాజ్ న్యూస్: హైదరాబాద్: తెలంగాణ  డిజిపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు...
By Gujile Ramu 2026-05-01 08:48:19 0 149
Telangana
తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ కార్యవర్గ సమావేశం
సికింద్రాబాద్ :  సికింద్రాబాద్ లోని రాయల్ రేవ్ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ...
By Sidhu Maroju 2025-10-15 10:34:33 0 283
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె తాగునీటి సమస్యపై వక్రీకరణలు మానుకోవాలని వైసీపీకి టీడీపీ హెచ్చరిక. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిప్పిలి ట్యాంక్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపణ.
మదనపల్లె: తాగునీటి సమస్యపై వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు...
By Pagadala Venkateswar 2026-07-20 11:28:13 0 24
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com