కర్నూలులో దొంగతనాలు !! రెచ్చిపోతున్న దొంగలు

0
196

కర్నూలు సిటీ : కర్నూలు నగరంలోని ప్రజా నగర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజూ రాత్రి మూడు ఇళ్లలో చోరీకీ పాల్పడ్డారు. ఆదివారం రాత్రి పి. గఫూర్ అనే వ్యక్తి ఇంట్లో రూ.50 వేల నగదు, 10 తులాల వెండి, కొంత బంగారం ఎత్తుకెళ్లారు. అదేవిధంగా ఎస్. ఫరూక్ అనే వ్యక్తి ఇంట్లో రూ.10 వేల నగదు, 10 తులాల వెండి దోచుకెళ్లారు. ఎస్. సత్తార్ వలి ఇంట్లో 2 తులాల బంగారు, 8 తులాల వెండి చోరీ చేశారు. ఆ ముగ్గురు వివిధ కారణాలతో వేరే ప్రాంతాలకు వెళ్లడంతో దొంగలు అదనుచూసి చోరీకీ పాల్పడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు యువగళం సారథి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినము సందర్భంగా
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...
By Chennaiah Kati 2026-01-24 06:09:36 0 241
Andhra Pradesh
ఓబన్న ఆయన త్యాగాలు తరతరాలు చాటాలి మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు
రేనాటి పోరాటానికి ప్రతీక వడ్డే ఓబన్న.. ఆయన త్యాగాలు తరతరాలకు చాటాలి   టిడిపి నేత, మాజీ...
By Rajini Kumari 2026-01-11 09:42:32 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com