తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి.

0
66

 

 

తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి

 

Andhra

Pawan Kalyan inquires about Tuni missing girl incident

వారం రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో తీవ్రత పెంచాలని ఆదేశం

గాలింపు చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు వినియోగించుకోవాలని సూచన

ఇప్పటికే 400 మంది సిబ్బందితో గాలిస్తున్నట్టు పవన్‌కు వివరించిన ఎస్పీ

అటవీ నిపుణుల సాయంతో పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా జల్లెడ పట్టాలని సలహా

కాకినాడ జిల్లా, తుని మండలం సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీని వీలైనంత వేగంగా కనుగొనాలని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన శనివారం కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి, గాలింపు చర్యల పురోగతిని సమీక్షించారు. వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ లభించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, దర్యాప్తును మరింత ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంపై ఆయన పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు.

 

ప్రస్తుతం పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్వహిస్తున్న గాలింపు చర్యలకు అదనంగా మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ముఖ్యంగా, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సేవలను కూడా వినియోగించుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాలిక ఇంటి పరిసరాల్లో దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నందున, ఆ ప్రాంతంలో విస్తృతంగా జల్లెడ పట్టాలని తెలిపారు. అడవుల్లో తిరగడంలో నైపుణ్యం ఉన్న నిపుణులు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నైట్ వాచర్లు, బేస్ క్యాంప్ వాచర్ల సహాయం తీసుకోవడం ద్వారా గాలింపును మరింత ప్రభావవంతంగా మార్చాలని సలహా ఇచ్చారు.

 

ఈ సందర్భంగా, జిల్లా ఎస్పీ చేపడుతున్న చర్యలను డిప్యూటీ సీఎంకు వివరించారు. బాలిక ఆచూకీ కోసం ఇప్పటికే 400 మందికి పైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అత్యాధునిక డ్రోన్ల సహాయంతో అణువణువూ గాలిస్తున్నామని, బాలిక ఇంటి చుట్టుపక్కల ఉన్న 38 సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించామని ఆయన పవన్ కల్యాణ్‌కు తెలియజేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాల నేపథ్యంలో గాలింపు చర్యలను మరింత విస్తృతం చేసి, అదనపు బలగాలను సమీకరించి, బాలికను సురక్షితంగా గుర్తించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఉన్నత స్థాయి నుంచి వస్తున్న పర్యవేక్షణతో ఈ కేసు దర్యాప్తులో మరింత వేగం పుంజుకుంది.

 

తుని చిన్నారి అదృశ్యం కేసులో ఆధారం అనుకున్న శునకం మృతి

 

చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాలిక ఆచూకీ కనుగొనడంలో పోలీసులకు కీలక ఆధారంగా నిలుస్తుందని భావించిన కుటుంబం పెంపుడు కుక్క మరణించింది. దీంతో ఈ కేసు దర్యాప్తులో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

 

తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో నివసిస్తున్న సుంకర గణేష్, భవానీ దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైన విషయం తెలిసిందే. పాపతో పాటు వారి పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. అయితే, కొన్ని రోజుల తర్వాత ఆ శునకం మాత్రమే తిరిగి ఇంటికి వచ్చింది.

 

దీంతో బాలిక జాడ కోసం పోలీసులు ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాన్ని వదిలిపెట్టారు. జీపీఎస్ అమర్చిన తర్వాత ఆ శునకం సుమారు 80 నిమిషాల పాటు 8 కిలోమీటర్ల మేర సమీప పొలాలు, అటవీ ప్రాంతంలో తిరిగి, మళ్లీ ఇంటికి చేరుకుంది. కానీ, ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. రోజుల తరబడి ఆహారం తీసుకోకపోవడం వల్లే అలసటతో అది మరణించి ఉంటుందని భావిస్తున్నారు.

 

ఇప్పటికే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు డ్రోన్ల సహాయంతో విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. ఇప్పుడు కీలక ఆధారం అనుకున్న శునకం కూడా మరణించడంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. పోలీసులు కిడ్నాప్ సహా ఇతర కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 20 వేల నష్టం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో సోమవారం వరిగడ్డి వామికి అగ్ని ప్రమాదం...
By Kothuru Murali 2026-03-17 07:01:17 0 160
Andhra Pradesh
మండవ కుటుంబారావు మూడవ వర్ధంతి సందర్భంగా టిటిడి కి 15 టన్నుల కూరగాయల లారీ ప్రారంభ సేవ
ప్రచురణార్థం:- 29-05-2026   *మండవ కుటుంబరావు 3వ వర్ధంతి సందర్భంగా టీటీడీకి 15 టన్నుల...
By Rajini Kumari 2026-05-29 11:31:49 0 79
Business & Finance
Kerala Tourism Sector Sees Rise in Business Activity
Kerala is witnessing increased business momentum in tourism-related sectors, including...
By Navya Sree 2026-07-01 13:54:52 0 68
Sports
International Scuba Day: Celebrating the Wonders Beneath the Waves
August 6 marks International Scuba Day, a global celebration dedicated to the adventurous sport...
By Bharat Aawaz 2025-08-06 07:09:57 0 1K
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:42:45 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com