జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ వార్షికోత్సవాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు

0
119

*హైదరాబాద్*

 

• జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్టీఆర్ ట్రస్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి

• యాన్యూవల్ రిపోర్టులు సమర్పించిన ఎన్టీఆర్ విద్యా సంస్థలకు చెందిన స్కూల్, కాలేజీ ప్రిన్సిపాల్స్ జోజి రెడ్డి, రామారావు.

*ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ...*

• విద్యార్థుల ఆశలకు అనుగుణంగా వారి భవిష్యత్తును రూపుదిద్దుతున్నాం.

• మానవ సేవే మాధవ సేవ అని ఎన్టీఆర్ నమ్మారు.. దానికి అనుగుణంగానే ఎన్టీఆర్ ట్రస్ట్ పని చేస్తోంది.

• ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి హెల్త్ కేర్ సర్వీసులు, తలసేమియా సెంటర్, ఎన్టీఆర్ సంజీవని క్లినిక్‌లు పని చేస్తున్నాయి.

• పేద, అనాథ పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాం.

• సివిల్ సర్వీసెస్ అకాడెమీ ద్వారా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి శిక్షణ ఇప్పిస్తున్నాం.

• ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు... ప్రకృతి వైపరీత్యాల్లో ఉన్నప్పుడు వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నాం.

• స్త్రీశక్తి ద్వారా పేద మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం.

• ఎన్టీఆర్ సుజల ద్వారా రక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నాం

• పేదల జీవితాల్ని బాగుపరిచేలా, విద్యార్థులకు అండగా నిలిచేలా, కుటుంబాలను ఆదుకునేలా ఎన్టీఆర్ ట్రస్ట్ పని చేస్తోంది... ఇదే ఎన్టీఆర్ కు మేం ఇచ్చే నివాళి.

• ఎన్టీఆర్ విద్యా సంస్థల ద్వారా చదువుకున్న వారు వివిధ ప్రాధాన్యత రంగాల్లో రాణిస్తున్నారు.

• విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే టీచర్లు ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో ఉన్నారు.

• బాహ్య ప్రపంచంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది... దానికి ఇక్కడి నుంచే సంసిద్దమవ్వండి.

• కోట్లాది మంది హృదయాలను ఎన్టీఆర్ గెలుచుకున్నారు.

• ఎన్టీఆర్ స్పూర్తితో.. ఆయన చూపిన దారిలో ఎన్టీఆర్ విద్యా సంస్థలను, ఎన్టీఆర్ ట్రస్టును నడుపుతున్నాం.

• విద్యార్థులే ఎన్టీఆర్ విద్యా సంస్థలకు అంబాసిడర్లు.

Search
Categories
Read More
Telangana
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు సర్వర్ డౌన్‌ కారణంగా ఉదయం నుంచి...
By Veeresh Kumar 2026-03-24 16:44:18 2 826
Andhra Pradesh
జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
బాపట్ల జిల్లా: పర్యావరణం పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాలలో వెలువడే చెత్త, మురుగును పద్ధతి...
By Gadiyapudi Narendra 2026-02-05 16:57:52 0 130
Andhra Pradesh
గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన గుంటూరు జిల్లా పోలీస్ శాఖ.
గుంటూరు  తేదీ 05.02.2026 న తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూడి గ్రామం వద్ద, ఎంఎల్ఏ...
By John Baji 2026-02-05 02:42:15 0 164
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com