వోటర్ మ్యాపింగ్ లో కర్నూలు జిల్లాకు 14వ స్థానం :: కలెక్టర్

0
87

కర్నూలు : కర్నూలు జిల్లాలో ఓటరు మ్యాపింగ్ 47.90 శాతం ఉందని, రాష్ట్రంలో కర్నూలు జిల్లా 14వ స్థానంలో నిలిచిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జనవరి చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 85 శాతం మ్యాపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియను సరిగా చేపట్టని ఇద్దరు బీఎల్వోలను సస్పెండ్ చేశామన్నారు. మున్ముందు బీఎల్వోలు నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏ) వెంటనే నియమించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో కలెక్టరేట్ లో ఉన్న ఈవీఎం గోదామును శనివారం త్రైమాసిక తనిఖీ చేపట్టారు. పటిష్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరుపై నిరంతరం నిఘా ఉంచాలని అక్కడి అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పులు లేని ఓటరు జాబితాలో రూపకల్పన బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మురళీ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యేశ్రీగణేష్ భేటీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తో...
By Sidhu Maroju 2025-07-14 11:03:26 0 1K
Andhra Pradesh
రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసిపి మహాపరాధం చేసింది
రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసింది   • సిట్ నివేదికలో...
By Chennaiah Kati 2026-02-04 09:59:13 0 82
Andhra Pradesh
ఇచ్ఛా పురం నుండి తిరుమల వరకు సైకిల్ యాత్ర
ఇచ్చాపురం న కు చెందిన ప్రసాద్ అనే యువకుడు సైకిల్ యాత్ర ఇచ్ఛాపురం నుండి తిరుమల వరకు...
By Mobbu Venkatramana 2026-02-10 12:16:56 8 1K
Andhra Pradesh
చౌడేపల్లి: పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజల కలకలం
చౌడేపల్లి మండలం కాగతి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గు వేసి,...
By Kothuru Murali 2026-01-20 14:01:44 0 416
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com