ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం **

0
170

*ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం*

మార్కాపురం జిల్లా.

పెద్ద దోర్నాల. మండల

స్థానిక శివసదనంలో శంకర నేత్రాలయం పుట్టపర్తి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. గాయం వెలుగొండ రెడ్డి శ్రీమతి సుబ్బరత్నం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు, మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ దోర్నాల ప్రాంతం ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతమని, చెంచు గిరిజనులు అధికంగా నివసించే ఈ ప్రాంత ప్రజలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.

కార్యక్రమానికి మార్కాపురం DSP యు నాగరాజు, పెద్ద దోర్నాల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ షేక్ మాబు, జెడి లక్ష్మయ్య, కూటమి నాయకులు తదితరులు హాజరయ్యారు. శ్రీ సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి మరియు సభ్యులు కూడా విరివిగా పాల్గొన్నారు.

ఈ శిబిరం వారం రోజుల పాటు నిర్వహించబడుతుందని ని

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో వెలసిన సుగుటూరు గంగమ్మను దర్శించుకున్న జిల్లా ఎస్పీ
పుంగనూరు పట్టణం, నగరి కాంపౌండ్ లో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో అన్నమయ్య జిల్లా ఎస్పీ...
By Kothuru Murali 2026-03-11 11:00:20 0 115
Telangana
నిజామాబాద్: 27 వ డివిజాన్ లో చలివేంద్రం ప్రారంభం
నిజామాబాద్:ఈరోజు 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి...
By Sadaq Sadaq 2026-04-19 12:04:32 0 81
Telangana
గోదావరిఖని : మహాత్మ జ్యోతిరావు పూలే 1999 జయంతి వేడుకలు..!
ఈరోజు స్థానిక రాజేష్ టాకీస్ సమీపంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ వేడుకలు ఘనంగా...
By Sunka Santhosh 2026-04-11 06:11:45 0 148
Andhra Pradesh
పుంగనూరు: దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ,...
By Kothuru Murali 2026-02-19 12:30:13 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com