PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారం

0
275

PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారం

బాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె మండలం అరవపల్లి గ్రామానికి చెందిన శ్రీ వై. సురేంద్ర గారు (తండ్రి సాయి బాబు) కు సంబంధించిన సర్టిఫికేట్ సమస్యకు ప్రజా గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS) ద్వారా పరిష్కారం లభించింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద లోన్ పొందేందుకు అవసరమైన పాపులేషన్ సర్టిఫికేట్ పొందే ప్రక్రియలో సమస్యలు తలెత్తడంతో ఆయన PGRSలో అర్జీ సమర్పించారు.
ఈ అర్జీపై స్పందించిన రేపల్లె తహసీల్దార్ అర్జీదారునితో మాట్లాడి సమస్యను వివరంగా తెలుసుకుని, సంబంధిత వివరాలతో నివేదిక సిద్ధం చేశారు. అనంతరం అర్హతను పరిశీలించి పాపులేషన్ సర్టిఫికేట్‌ను జారీ చేశారు.

దీంతో శ్రీ వై. సురేంద్ర గారికి ఎదురైన సర్టిఫికేట్ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించింది. ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో PGRS వ్యవస్థ ఎంతో ప్రభావవంతంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
International
భారత్-అమెరికా వాణిజ్య వివాదం: రైతుల హక్కులపై మోదీ కీలక ప్రకటన
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త సవాళ్లు తలెత్తాయి. ఇటీవల అమెరికా కొన్ని భారతీయ ఉత్పత్తులపై...
By Triveni Yarragadda 2025-08-11 08:24:58 0 1K
Andhra Pradesh
​బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి.
మదనపల్లిలో చిన్నారిపై జరిగిన దారుణ ఘటన అత్యంత బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం...
By Pagadala Venkateswar 2026-02-25 07:43:53 0 89
Telangana
గజ్వేల్: తహశీల్దార్‌పై ఏసీబీ దాడులు.. రూ.4 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
గజ్వేల్: తహశీల్దార్‌పై ఏసీబీ దాడులు.. రూ.4 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు ఆదాయానికి మించిన...
By Ellandula Sandeep 2026-03-08 04:45:15 0 99
Andhra Pradesh
మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం.
మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని దినసరి మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు 2026-27...
By Pagadala Venkateswar 2026-03-31 10:42:21 0 65
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com