PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారం

0
276

PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారం

బాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె మండలం అరవపల్లి గ్రామానికి చెందిన శ్రీ వై. సురేంద్ర గారు (తండ్రి సాయి బాబు) కు సంబంధించిన సర్టిఫికేట్ సమస్యకు ప్రజా గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS) ద్వారా పరిష్కారం లభించింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద లోన్ పొందేందుకు అవసరమైన పాపులేషన్ సర్టిఫికేట్ పొందే ప్రక్రియలో సమస్యలు తలెత్తడంతో ఆయన PGRSలో అర్జీ సమర్పించారు.
ఈ అర్జీపై స్పందించిన రేపల్లె తహసీల్దార్ అర్జీదారునితో మాట్లాడి సమస్యను వివరంగా తెలుసుకుని, సంబంధిత వివరాలతో నివేదిక సిద్ధం చేశారు. అనంతరం అర్హతను పరిశీలించి పాపులేషన్ సర్టిఫికేట్‌ను జారీ చేశారు.

దీంతో శ్రీ వై. సురేంద్ర గారికి ఎదురైన సర్టిఫికేట్ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించింది. ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో PGRS వ్యవస్థ ఎంతో ప్రభావవంతంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: సరిహద్దులో ఘోర ప్రమాదం.. గుర్రంకొండ వ్యక్తి మృతి.
కర్ణాటక సరిహద్దులోని చీకిలబైలు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
By Pagadala Venkateswar 2026-03-04 11:45:23 0 91
Andhra Pradesh
ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం: స్థానికులే బాధితుడికి ఆసరా.
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని...
By Pagadala Venkateswar 2026-03-09 09:18:20 0 84
Andhra Pradesh
గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్ర వెళ్లిన 720 మందికి సబ్సిడీ వేయాలి
2024వ సంవత్సరం లో గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్రకు వెళ్లిన. 720 మందికి. సబ్సిడీ...
By Rajini Kumari 2025-12-23 10:35:39 0 151
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com