అమరావతిలో అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహావిష్కరణకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గము నుండి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లిన ఎన్డీయే కూటమి నేతలు ప్రజలు

0
221

భారత మాజీ ప్రధాని, అజాత శత్రువుగా దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఆయన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గుంటూరు లాడ్జి సెంటర్ నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివెళ్లారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావులు ఎన్డీయే కూటమి నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అమరావతికి బయలుదేరిన బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి ప్రారంభించారు.

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మీడియాతో మాట్లాడుతూ....*

అమరావతిలో ఈ రోజు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతిలో అటువంటి మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రానికి, అమరావతి భవిష్యత్తుకు గర్వకారణమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతిని ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో, అలాంటి మహానేతకు నివాళులు అర్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం ఒక వ్యక్తి కాదని, దేశానికి “గుడ్ గవర్నెన్స్” అనే భావనను అందించిన గొప్ప దార్శనిక నాయకుడని పేర్కొన్నారు.

గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టు, గ్రామీణాభివృద్ధి పథకాలు, విద్యా రంగానికి ఆయన అందించిన ప్రోత్సాహం, దేశ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు – కార్గిల్ యుద్ధం, పోక్రాన్ అణు పరీక్షలు వంటి చారిత్రాత్మక ఘట్టాలు వాజ్‌పేయి పాలనలోనే సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుర్తు చేశారు. దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెంచిన నాయకుడిగా, అదే సమయంలో సౌభ్రాతృత్వం, పొరుగుదేశాలతో సత్సంబంధాలను కాపాడిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని అన్నారు.

అటల్ అనే పేరు అర్థమే అచంచలమైనది, విభజించలేనిదని, ప్రధానిగా మాత్రమే కాకుండా సామాజిక సంస్కర్తగా, రచయితగా, భారతరత్నగా భారతదేశానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివని తెలిపారు. ఈ గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నేతలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రకాశం జిల్లా – దర్శి నియోజకవర్గం, పెద్ద ఉల్లగళ్లులో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి అధ్యక్షతన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు
ప్రకాశం జిల్లా – దర్శి నియోజకవర్గం, పెద్ద ఉల్లగళ్లులో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి...
By Chennaiah Kati 2026-01-17 14:56:38 0 248
Andhra Pradesh
పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో బుధవారం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ...
By Kothuru Murali 2026-04-30 11:24:21 0 104
Andhra Pradesh
ఎమ్మియనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి
మంత్రాలయం నియోజకవర్గంలోని చిలకలడోన గ్రామం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం...
By Boya Dasthagiri 2026-04-16 07:24:39 0 185
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:06 0 38
Telangana
"జూన్ 2న హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్.. పరేడ్ గ్రౌండ్స్ వేడుకలతో పలు మార్గాల్లో ఆంక్షలు!"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో జూన్ 2న...
By Sidhu Maroju 2026-06-01 07:14:18 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com