ఎమ్మియనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
180

మంత్రాలయం నియోజకవర్గంలోని చిలకలడోన గ్రామం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దైవ దర్శనార్థం ప్రయాణిస్తున్న భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.

ఈ ఘటన కూటమి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. రహదారి భద్రత, అత్యవసర వైద్య సదుపాయాలు, అంబులెన్స్ వ్యవస్థలను బలోపేతం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్ర‌మాద ప్రదేశాల సమీపంలో ట్రామా కేర్ సెంటర్లు, తక్షణ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్లే ప్రాణనష్టం పెరుగుతోందని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

క్షతగాత్రులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు గౌరవప్రదమైన పరిహారం వెంటనే ప్రకటించి అందజేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు గట్టిగా డిమాండ్ చేశారు

యాత్రికులు అధికంగా ప్రయాణించే మార్గాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థలు, అత్యవసర సేవలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Search
Categories
Read More
Telangana
Goshamahal Osmania Hospital
గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి, సీఎం రేవంత్ రెడ్డి...
By Yadamma Raju Gajapaga 2025-12-22 07:40:13 1 782
Andhra Pradesh
పుంగనూరు: ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలో ఆదివారం భూమి వాదం కర్రల దాడికి దారితీసింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-03-23 04:46:03 0 167
SURAKSHA
అతరరాజ్ సాయిబర్ నెట్‌వర్క్ కా భండాఫోడ్: పులిస్ నే కియా బడా ఖులాసా
ఇటీవల పోలీసులు ఒక భారీ అంతర్రాష్ట్ర సైబర్ నెట్‌వర్క్‌ను ఛేదించి, కీలక సభ్యులను అరెస్టు...
By Kalaga Sailaja 2026-06-24 12:07:00 0 80
Telangana
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి cc రోడ్డు ప్రారంభం
తలకొండపల్లి మండలం లోని పడకల్ గ్రామంలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి చేసే అభివృద్ధి లో...
By MERIGE MALLESH 2026-03-28 09:59:04 0 348
Andhra Pradesh
పంటలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు
పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారి పల్లి వద్ద ఆదివారం వేకువజామున ఒక ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-01-11 13:15:56 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com