అటల్ బిహారీ వాజ్పేయి గారిని కొనియాడిన దేవినేని ఉమామహేశ్వరరావు

0
255

ప్రజామన్ననలు పొందిన నాయకులు అటల్ బిహారీ వాజ్ పేయి ... సమర్థ నాయకత్వంతో సుపరిపాలన అందించారు

 

దేవినేని ఉమామహేశ్వర రావు 

 

గొల్లపూడి: 25 డిసెంబరు 2025

 

భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. 

 

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, 9 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తోందన్నారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్ పేయి ఎంతో కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. దేశంలో సుపరిపాలనకు వాజ్‌పేయ్ నాంది పలికారు. ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాదిని వేశాయన్నారు. ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగతంగా కూడా అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుపరిపాలన ఏ విధంగా ఉండాలో ఎన్టీఆర్, వాజ్ పేయ్ చూస్తే అర్థమవుతుందన్నారు. నాడు కార్గిల్, అణు పరీక్షలు ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలుగా చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: హత్య జరిగిన ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం.
మదనపల్లెలో రిషిక ప్రియా అనే వ్యక్తి దారుణ హత్య మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో...
By Pagadala Venkateswar 2026-02-17 05:10:45 0 166
Telangana
"భద్రతపై అల్వాల్ పోలీసుల చైతన్యం: ఏఆర్కే అపార్ట్‌మెంట్స్‌లో ‘మీ సురక్ష’ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి జోన్ పరిధిలోని అల్వాల్ ఏఆర్కే అపార్ట్‌మెంట్స్...
By Sidhu Maroju 2026-05-25 03:40:41 0 203
Andhra Pradesh
మదనపల్లె: హత్య కేసులో నిందితుల అరెస్టు కోరుతూ ధర్నా.
మదనపల్లె మండలం సీటీఎం దళితవాడకు చెందిన మేస్త్రి మురళి (45) హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు...
By Pagadala Venkateswar 2026-04-29 04:56:45 0 94
Telangana
"కాళేశ్వరం, కరవు"పై ప్రభుత్వాన్ని నిలదీసిన..ఈటల.|
"కన్నెపల్లి నుంచి నీటి తరలింపుపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని సూచన.. రిటైర్డ్ ఇంజనీర్లకు సీఎం...
By Sidhu Maroju 2026-07-13 11:04:36 0 117
Chandigarh
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation In a major...
By BMA ADMIN 2025-05-21 05:48:27 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com