విజయవాడ భవానిపురం జోజి నగర్ ప్రజలకు ఎంపీ కేశినేని భరోసా

0
162

*ప్రచుర‌ణార్థం* *24-12-2025*

 

 

జోజి న‌గ‌ర్ 42 ప్లాట్ యజమానులకు ఎంపీ కేశినేని చిన్ని భరోసా

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన బాధిత ఫ్లాట్ యజమానులు

 

విజ‌య‌వాడ : ప‌శ్చిమ నియోజ‌క‌వర్గం భ‌వానీ పురం జోజిన‌గ‌ర్ కు చెందిన 42 మంది బాధిత ప్లాట్ యాజ‌మానులు ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను బుధ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని ఆయ‌న కార్యాల‌యంలో క‌లిశారు. ప్లాట్ విష‌యంలో త‌మ‌కి జ‌రిగిన అన్యాయం గురించి మొర‌పెట్టుకున్నారు. ప్లాట్ ల విష‌యంలో ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు బాధితులు వివ‌రించారు. ఈ విష‌యం పై సానుకూలంగా స్పందించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఇప్ప‌టికే ఈ విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని...దీనిపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపించి వివ‌రాలు తెలుసుకుంటాన‌ని, అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌ని, త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని వారికి హామీ ఇచ్చారు. 

 

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన వారిలో ప్లాట్ ఓన‌ర్స్ ప్ర‌వీణ్, లక్ష్మీనారాయ‌ణ‌, ఎల్ల‌రావు, విజ‌య‌ల‌క్ష్మీ, బి.ఎల్ల‌రావు, మంజునాథ్ ల‌తో పాటు త‌దిత‌రులు వున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
*ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు నిర్వహించారు
*ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు...
By Chennaiah Kati 2026-02-06 15:21:48 0 95
Andhra Pradesh
దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు
*దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష*    *Jan 21st, 2026*  ...
By Rajini Kumari 2026-01-21 14:58:53 0 72
Andhra Pradesh
మోటర్లు చోరీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగాని పల్లె పంచాయతీ పరిధిలోని మల్లుపల్లి గ్రామాల్లో గత కొన్ని...
By Kothuru Murali 2026-01-06 09:17:03 0 78
Andhra Pradesh
భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్ దినోత్సవం వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ 20-01-2025   ప్రచురణార్ధం   భక్తి శ్రద్దలతో వాసవి మాత ఆత్మార్పణ...
By Rajini Kumari 2026-01-20 10:16:59 0 61
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com