కనకమెడల రవీంద్ర కు అభినందనలు తెలిపినmP కేశినేని గద్దె రామ్మోహన్

0
157

*ప్రచుర‌ణార్థం* *24-12-2025*

 

క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్రకు అభినంద‌న‌లు తెలిపిన ఎంపీ కేశినేని , ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్

 

విజ‌య‌వాడ‌: సుప్రీంకోర్టులో భార‌త ప్ర‌భుత్వ అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ గా (ASG) నియ‌మితులైన సీనియ‌ర్ న్యాయ‌వాది, టిడిపి మాజీ రాజ్య‌స‌భ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ అభినంద‌న‌లు తెలిపారు. బుధ‌వారం ల‌బ్బీపేట‌లోని ఆయ‌న నివాసంలో క‌లిసి శాలువాతో స‌త్క‌రించి కొండ‌ప‌ల్లి బొమ్మ‌ను బ‌హుక‌రించారు. రాజ్య‌స‌భ స‌భ్యునిగా విశేష సేవ‌లందించిన క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర, ఇక‌పై అత్యున్న‌త న్యాయ‌స్థానంలో కేంద్ర ప్ర‌భుత్వం త‌రుఫున కీల‌క వాద‌న‌లు వినిపించనుండ‌టం ఎంతో ఆనందంగా వుంద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. దేశంలోనే ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన ఈ ప‌ద‌విలో తెలుగు వ్య‌క్తి...నియ‌మితులు కావ‌టం ఎంతో గ‌ర్వంగా వుంద‌ని ఎమ్మెల్యే గ‌ద్దె అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు.. సగర్వంగా ఆలపించిన రైల్వే ఉద్యోగులు.|
సికింద్రాబాద్ : వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రైల్ నిలయంలో దక్షిణ మధ్య...
By Sidhu Maroju 2025-11-07 14:33:57 0 221
Andhra Pradesh
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చుండూరి...
By Gadiyapudi Narendra 2025-12-30 17:07:05 0 220
Andhra Pradesh
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మండలం చెన్న ముక్క పల్లి గ్రామం కొలిమి మెట్టుకు వెళ్లే 600 మీటర్లు 20 లక్షల రూపాయల వ్యయంతో...
By Benguluri Madhubabu 2026-03-15 01:44:58 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com