మహనీయుల స్ఫూర్తితో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన రక్తదాన శిభిరం విజయవంతం-CITU

0
279

ఈరోజు మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ జయంతుల సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తుమ్మల.రాజారెడ్డి మాట్లాడుతూ కేవలం కార్మికుల సమస్యలపైన పోరాటాలు, ఆందోళనలు కాకుండా సామాజిక బాధ్యతగా మహనీయుల స్పూర్తితో నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీ ఎత్తున దాదాపు 150 కి పైగా యువ కార్మికులు హాజరై రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతినెల రక్త మార్పిడి చేయాల్సి ఉంటుందని వారికి చేయూతనిచ్చే విధంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు తమ వంతు బాధ్యతగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గత నెలలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా మందమర్రిలో మరియు జ్యోతి బాపూలే, అంబేద్కర్ జయంతుల సందర్భంగా ఈరోజు శ్రీరాంపూర్లోని నస్పూర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమానికి అవగాహన కలిగిన యువకుల నుండి భారీ స్పందన వస్తున్నందున త్వరలో మిగిలిన ఏరియాలలోను ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని అంతేకాకుండా కోల్ బెల్ట్ ప్రాంతాలలో త్వరలో మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నామని తెలిపారు. సింగరేణి యాజమాన్యం కూడా కార్మికులకు నిర్వహిస్తున్న పీ.ఎం.ఈ టెస్టులలో విటమిన్ లోపం, కిడ్నీ, లివర్ లోపాల తదితర టెస్టులను కూడా చేయాలని సింగరేణి యాజమాన్యానికి సూచించారు. రక్తదాన శిబిరాలకు హాజరై తమ వంతు బాధ్యతగా ఇతరుల ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేసిన యువకులు అందరికీ యూనియన్ తరపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ నాయకులతోపాటు పిట్ సెక్రటరీలందరూ పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
SURAKSHA
Magizhchi: A Holistic Wellness Initiative for Police
The Tamil Nadu Police’s 'Magizhchi' program is a vital initiative designed to prioritize...
By Lokeshwari Panthadi 2026-07-03 08:49:38 0 65
Business & Finance
Kerala Tourism Sees Strong Monsoon Bookings
Kerala's tourism industry is witnessing strong monsoon bookings as domestic travelers...
By Navya Sree 2026-07-06 07:31:32 0 89
Andhra Pradesh
మదనపల్లి: రైతులకు లాభమే లక్ష్యం - ఏఎంసీ ఛైర్మన్.
మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, సెక్రటరీ జగదీష్‌తో కలిసి మార్కెట్ యార్డును...
By Pagadala Venkateswar 2026-03-03 04:04:08 0 161
Telangana
మైలారం గ్రామ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక
శాయంపేట మండలంలోనీ మైలారం గ్రామంలో ఉన్న పురాతన దేవాలయం శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం...
By Sriramula Anil 2026-06-16 06:05:20 0 302
Rajasthan
The Semiconductor Leap
Rajasthan is rapidly transforming into a major high-tech hub. The state government, in...
By Dunna Jessicaruth 2026-05-25 10:23:03 0 405
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com