ఏపీలో కొత్తగా మరో 70 అన్న క్యాంటీన్లు ఏర్పాటు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే

0
183

 సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో 70 అన్న క్యాంటీన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. పట్టణాల్లో విజయవంతమైన ఈ పథకాన్ని ఇప్పుడు గ్రామాలకు విస్తరిస్తున్నారు. తక్కువ ధరకే రుచికరమైన భోజనం అందించే ఈ క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చనున్నాయి. ఇప్పటికే లక్షలాది మందికి ఈ పథకం అండగా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రజలకు శుభవార్త అందించింది. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు కాబోతున్నాయి. మొత్తం 70 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. జనవరి 10లోగా నిర్మాణ పనులు పూర్తి చేసి.. జనవరి 13 నుంచి 15 మధ్య ఈ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు విజయవంతం అయ్యాయి.. ప్రజల నుంచి ఆదరణ వస్తోంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా మొత్తం 70 క్యాంటీన్లను మంజూరు చేసింది. ప్రస్తుతం పట్టణాల్లో 205 అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి.. వీటిలో రోజుకు మూడు పూటలా కలిపి 2 లక్షల మందికి పైగా ప్రజలు తక్కువ ధరకే భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ఒక్కో పూటకు కేవలం రూ.5కే రుచికరమైన ఫుడ్ అందిస్తున్నారు. ఈ పథకం గ్రామీణ ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన 205 అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నారు. ఇప్పటివరకు 7.20 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ క్యాంటీన్లలో భోజనం చేశారు. ఇందులో మధ్యాహ్న భోజనం చేసిన వారి సంఖ్య 3.16 కోట్లు. ఉదయం అల్పాహారం 2.62 కోట్ల మంది, రాత్రి భోజనం 1.42 కోట్ల మంది తీసుకున్నారు. ఈ క్యాంటీన్లలో విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుండి అత్యధిక సంఖ్యలో పేదలు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లోని క్యాంటీన్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. పేదల ఆకలి తీర్చడమే ఈ క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశ్యం. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించడం ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తున్నాయి. ఇప్పుడు గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.

జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరు 7, గుంటూరు 5, శ్రీకాకుళం జిల్లా 5, తూర్పుగోదావరి 4, ఏలూరు 4, ప్రకాశం 4, కర్నూలు 4, విజయనగరం 3, అనంతపుురం 3, అల్లూరి సీతారామరాజు 3, అనకాపల్లి 3, బీఆర్ అంబేద్కర్ కోనసీమ 3, పశ్చిమ గోదావరి 3, కృష్ణా 3, నెల్లూరు 3, అన్నమయ్య 3, కాకినాడ 2, తిరుపతి 2, పార్వతీపురం మన్యం 1, పల్నాడు 1, ఎన్టీఆర్ 1, శ్రీసత్యసాయి 1, నంద్యాల 1, కడప 1 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సదుం మండలంలో పర్యటించిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి లక్ష్మీపతి పర్యటించారు....
By Kothuru Murali 2026-04-30 11:27:08 0 61
Andhra Pradesh
ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు నియోజకవర్గం సమన్వయకర్త ఎర్రకోట...
By Boya Dasthagiri 2026-04-11 09:17:24 0 133
Telangana
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం... తెలుగు నటుడికి అరుదైన గౌరవం
ఆస్కార్ వేడుకలో తెలుగు నటుడు కోట శ్రీనివాస రావుకు ఘన నివాళులు అర్పించింది. లాస్...
By Ponnala Srinivasrao 2026-03-17 03:46:41 0 231
Andhra Pradesh
రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు.
రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్‌కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...
By Pagadala Venkateswar 2026-05-08 05:40:55 0 67
Andhra Pradesh
పట్టాదారు పాసు పుస్తకముల పంపిణీ కార్యక్రమం_పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమ సందర్భంగా భూ రికార్డ్స్...
By John Baji 2026-01-02 14:44:41 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com