చీరాలలో భారీ మెగా జాబ్ మేళా * 1,400 ఉద్యోగ ఖాళీలతో నిరుద్యోగులకు సువర్ణావకాశం * పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే మాలకొండయ్య

0
1K

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రత్యేక సహకారంతో చీరాల పట్టణంలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 17 మార్చి 2026 మంగళవారం నాడు స్థానిక ఎన్ఆర్పియం హైస్కూల్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి యం. మాధవి తెలిపారు.

21 ప్రముఖ కంపెనీల ఈ మెగా జాబ్ మేళాలో ఫ్లెక్స్ టెక్ సొల్యూషన్స్, ఇన్నోవా సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, మాస్టర్ మైండ్స్, క్యాపస్టన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, బిగ్ సి, ఎయిర్టెల్, గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హీరో మోటర్స్, హేటిరో డ్రగ్స్ వంటి సుమారు 21 ప్రముఖ బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నాయి. మొత్తం 1,400కు పైగా ఖాళీలు ఉన్నాయని, అభ్యర్థుల విద్యార్హతను బట్టి నెలకు రూ. 10,000 నుండి రూ. 20,000 వరకు వేతనం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అర్హతలు కావలసిన పత్రాలు విద్యార్హత ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా, బి.టెక్, ఎం.బి.ఏ,పి.జి పూర్తి చేసిన వారు అర్హులు అని తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొని వారు కనీసవయస్సు 18 నుండి 35 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువతీ యువకులు హాజరుకావచ్చు తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటా , విద్యా సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు నకలు మరియు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు . ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొరకు ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా వెబ్ పోర్టల్ నందు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 9988853335 లేదా ఈ క్రింది మొబైల్ నంబర్లను సంప్రదించవచ్చు అని 

7981443777, 8555901198, 9100566581, 9949914337.చీరాల ప్రాంతంలోని అర్హులైన నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కోరింది.

Search
Categories
Read More
Telangana
ఇ నెల 15 నుండి సింగరేణిలో కల్వకుంట్ల కవిత రావు పర్యటన
హైదరాబాద్ జూన్ 3 : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 15 నుంచి సింగరేణి...
By Avunoori Mahesh 2026-06-03 15:34:15 0 128
Andhra Pradesh
YS Jagan: ప్రభుత్వ వైఫల్యమే కారణం.. కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్.
రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురి మృతి! ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ప్రభుత్వ...
By Pagadala Venkateswar 2026-02-23 10:16:07 0 157
Andhra Pradesh
నగర రోడ్లపై ప్రమాదకరంగా మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు - ఆందోళనలో వాహనదారులు
చీరాల పట్టణం లో రద్దీగా ఉండే నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న భారీ వాహనాలు సామాన్య...
By Vadlamudi NagaVenkat 2026-03-06 11:17:36 0 488
Andhra Pradesh
ఎన్నికల హామీలను అమలు చేయాలి
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్...
By Boiena Rajesh 2026-03-16 03:50:12 0 193
Bihar
Bihar Wooing Investors With Amended Package
Addressing the centenary business conclave of the Bihar Chamber of Commerce and Industries in...
By Dunna Jessicaruth 2026-05-25 05:00:04 0 71
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com