జీరో బిల్లు కోసం కరెంట్ మీటర్ మార్చాడు.. తీరా రీడింగ్ చూసి కళ్లు బైర్లు కమ్మాయ్ !!!

0
211

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఓ దినసరి కూలికి విద్యుత్ బిల్లు షాకిచ్చింది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

వనపర్తి జిల్లాలోని కడుకుంట్ల గ్రామానికి చెందిన వెంకటేశ్ ఓ నిరుపేద కూలి. భార్య, భర్తలు ఇద్దరూ కూలీ పనిచేసుకుంటూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. వీరికి రెండు రూములతో ఓ నివాస గృహం ఉంది. ప్రతినెలా ఈ నివాసానికి సుమారు రూ.200 కరెంట్ బిల్లు వస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన గృహజ్యోతి పథకానికి అర్హులైనప్పటికీ గతంలో బిల్లు పెండింగ్ ఉండడంతో అమలు కావడం లేదు. దీంతో విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించగా పెండింగ్‌లో ఉన్న బిల్లు కట్టి మీటర్ మార్చుకోవాలని సూచించారు. దీంతో రూ.813 పెండింగ్ బిల్లును చెల్లించాడు.

 

అనంతరం కరెంట్ మీటర్ మార్పించాడు. నెల తిరిగి చూసేసరికి జీరో వస్తుందని పెట్టించిన కరెంట్ మీటర్ వెంకటేష్‌ను అవాక్‌కు గురి చేసింది. ఏకంగా రూ.7122 బిల్లు జనరేట్ కావడంతో లబోదిబోమంటున్నాడు వెంకటేష్. కూలీ పనిచేసుకుని బతికే తాను ఇంత బిల్లు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నాడు. అయితే విషయం విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే చేస్తాం.. చూస్తాం.. అనే సమాధానాలు చెబుతున్నారని వెంకటేష్ చెబుతున్నాడు. నిరుపేదనైన తనకు అధిక బిల్లు విషయంలో సరైన న్యాయం చేయాలని.. గృహజ్యోతి పథకాన్ని వర్తింపచేయాలని వేడుకుంటున్నాడు.

#Sivanagendra #Trending #Currentmeter #Telangana

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ముగ్గుల పోటీలు.
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో వికాస్ హాస్పిటల్స్ ప్రధాన...
By John Baji 2026-01-04 11:31:15 0 154
Telangana
పాలు పలిగాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూకట్ పల్లి పోలీసులు
కూకట్‌పల్లిలో హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు. ...
By Sidhu Maroju 2025-06-24 12:38:15 0 1K
Telangana
గాదె ఇన్నయ్య కు బెయిల్ మంజూరు
మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన...
By CM_ Krishna 2026-01-17 05:31:42 0 251
Andhra Pradesh
Pawan Kalyan: మనకెందుకులే అనుకోవద్దు... ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంటుంది: పవన్ కల్యాణ్.
హిందూ ధర్మంపై దాడులు జరిగినప్పుడు మౌనం వీడాలని పవన్ పిలుపు   కేవలం భక్తులుగా కాకుండా ధర్మ...
By Pagadala Venkateswar 2026-02-06 14:19:38 0 115
Telangana
రూ.2.08.కోట్ల విలువైన, దొంగలించిన 1,039 మొబైల్ ఫోన్ ల రికవరీ. |
       మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్...
By Sidhu Maroju 2026-01-09 06:25:04 0 145
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com