సి ఎస్ ఎస్ నిధులు నూరు శాతం వినియోగించాలి గుంటూరు జిల్లా కలెక్టర్. ఏ తమిమ్ అన్సారియా

0
115

 *సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి* గుంటూరు, డిసెంబర్ 23:-జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) మంజూరు చేసిన నిధులు నూరుశాతం నిర్దేశించిన కాలపరిమితి లో వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు వినియోగం పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి, త్రాగునీరు,శానిటేషన్, విద్య, ఆరోగ్యం,పోషణ, మహిళ–బాలల అభివృద్ధి తదితర కార్యక్రమాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు, వాటి ద్వారా నిర్వహిస్తున్న పనులపై అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శాఖల వారీగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన విధులు, వాటిలో వినియోగించిన నిధులు, మిగిలిన నిధుల వినియోగానికి కార్యాచరణ ప్రణాళికను సోమవారం నాటికి పూర్తిస్థాయి నివేదిక విభాగాధిపతులు అందించాలని సూచించారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపిసీ పద్మావతి, డీఈఓ సలీం భాష, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
చీరాల: చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి...
By Gadiyapudi Narendra 2026-02-07 13:56:26 0 52
Telangana
అభయ అమృత వర్షిణి బదిరుల పాఠశాలలో పోలీసుల నూతన సంవత్సర వేడుకలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అభయ అమృత వర్షిణి బదిరుల...
By Sidhu Maroju 2026-01-01 13:50:48 0 84
Andhra Pradesh
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు
*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2025-12-20 12:06:11 0 88
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com