సి ఎస్ ఎస్ నిధులు నూరు శాతం వినియోగించాలి గుంటూరు జిల్లా కలెక్టర్. ఏ తమిమ్ అన్సారియా

0
216

 *సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి* గుంటూరు, డిసెంబర్ 23:-జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) మంజూరు చేసిన నిధులు నూరుశాతం నిర్దేశించిన కాలపరిమితి లో వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు వినియోగం పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి, త్రాగునీరు,శానిటేషన్, విద్య, ఆరోగ్యం,పోషణ, మహిళ–బాలల అభివృద్ధి తదితర కార్యక్రమాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు, వాటి ద్వారా నిర్వహిస్తున్న పనులపై అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శాఖల వారీగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన విధులు, వాటిలో వినియోగించిన నిధులు, మిగిలిన నిధుల వినియోగానికి కార్యాచరణ ప్రణాళికను సోమవారం నాటికి పూర్తిస్థాయి నివేదిక విభాగాధిపతులు అందించాలని సూచించారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపిసీ పద్మావతి, డీఈఓ సలీం భాష, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
The Vanguard of Public Trust: IPS G. Krishnakanth and the Evolution of Community Policing
Sub Headline: From the corridors of academic excellence to the frontlines of law enforcement,...
By Kalaga Sailaja 2026-07-14 05:20:18 0 50
Andhra Pradesh
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహిస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం...
By Rajini Kumari 2025-12-21 08:22:03 0 201
Andhra Pradesh
మదనపల్లె: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు - జేసీ.
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ శర్మ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)...
By Pagadala Venkateswar 2026-04-07 04:02:14 0 131
Andhra Pradesh
దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ - నిర్లక్ష్యంపై అధికారులకు హెచ్చరిక
దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ – నిర్లక్ష్యంపై అధికారులకు హెచ్చరిక...
By Chennaiah Kati 2026-03-07 12:02:34 0 311
Telangana
బోరు బావి ప్రారంభించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు...
మర్రిపల్లి/దుగ్గొండి భారత్ ఆవాజ్ న్యూస్... దుగ్గొండి :మండలం,మర్రిపల్లి గ్రామంలో నూతనంగా...
By Gujile Ramu 2026-04-28 02:59:36 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com