మైనార్టీ ఆస్తులపై కన్నేసిన కూటమి ప్రభుత్వం నేతలు.

0
243

అంజుమన్ కి సబదించినినా ఈ భూమి ఎన్నో దశాబ్దాలుగా మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలకు, విద్యా-సామాజిక అవసరాలకు ఉపయోగపడుతోందని, అలాంటి ఆస్తిపై ప్రభుత్వం కన్నేయడం అన్యాయమని ఆమె విమర్శించారు. మైనారిటీలకు చెందిన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కానీ, అదే ప్రభుత్వం వాటిని దోచుకునే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

కూటమి ప్రభుత్వ పాలనలో మైనారిటీల హక్కులు, వారి ఆస్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, ఈ పరిణామం రాష్ట్రంలోని అన్ని మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆమె తెలిపారు. ప్రజా ఉద్యమంతో పాటు న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, మైనారిటీల ఆస్తులపై జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలని, లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వైసిపి నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్. రాష్ట్ర కార్యదర్శి  షేక్ గులాబ్ రసూల్, కార్పొరేటర్లు మెహబూబ్ ,ఆబిద్ ఫర్జానా , రాష్ట్ర మైనార్టీ సెల్ సభ్యులు షేక్ అఫ్సర్, జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్లా ఖాన్, తూర్పు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు లియాకత్ అలీ మరియు తదితరు నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్:  ఈ రోజు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే గారి నివాసంలో ఆంధ్రప్రదేశ్...
By Hari Krishna 2026-01-19 16:23:38 0 172
Telangana
గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|
  హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది. ...
By Sidhu Maroju 2026-02-27 12:00:33 0 167
Andhra Pradesh
డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్
విజయవాడ    *డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్*  ...
By Rajini Kumari 2026-04-24 13:13:08 0 169
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్తు: పొలంలో అరుదైన మే పుష్పం వికసించింది
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో రవి కుమార్ అనే రైతు...
By Kothuru Murali 2026-05-26 11:32:10 0 80
Andhra Pradesh
చింతూరు ఘాట్ రోడ్డులో 'భారీ' బ్రేక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!
పోలవరం జిల్లాకు గుండెకాయలాంటి మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డు సోమవారం ఉదయం స్తంభించిపోయింది....
By Shyamala Yadagiri 2026-05-11 07:42:03 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com