TDP మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి

0
100

వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్

 

టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు 

 

గొల్లపూడి - 23 డిసెంబర్ 2025

 

వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్ గారని, ఆయన పుట్టినరోజు డిసెంబర్ 23ని ‘జాతీయ రైతు దినోత్సవం’గా జరుపుకుంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం గొల్లపూడ కార్యాలయంలో చౌదరి చరణ్ సింగ్ చిత్రపటానికి స్థానిక నేతలతో కలసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, దేశానికి రైతన్నలు చేస్తున్న సేవలు, మద్దతు ధర, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమానికి సరికొత్త వ్యవసాయ పద్ధతులు వంటి అంశాలపై చౌదరి చరణ్ సింగ్.. రైతుల కోసం చాలా చేశారని, వారి హక్కుల కోసం పోరాడారని ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఆయన రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందువల్ల ఆయన జయంతినే కిసాన్ దివస్‌గా జరుపుకుంటున్నామన్నారు. ఆచార్య ఎన్ జి రంగా, చౌదరి చరణ్ సింగ్, దేవీ లాల్ రైతుల హక్కుల కోసం పోరాడి, భారత రాజకీయాల్లో రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించిన ప్రముఖులుగా వారి సేవలను స్మరించారు. రైతు సాధికారత కోసం శ్రీ చౌదరీ చరణ్ సింగ్ ఎంతగానో పరితపించే వారని, ఆయన చూపిన బాటలో పయనిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం: భర్త ఆచూకీ తెలపాలని ఎస్పీ ఆఫీస్ ఎదుట ధర్నా
విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లిన తన భర్త రాజేంద్ర నాయుడు ఆచూకీ తెలపాలంటూ దుర్గ భవాని అనంతపురం...
By Eslavath RameshNaik 2026-01-21 14:16:32 0 171
Andhra Pradesh
చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
చీరాల: చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి...
By Gadiyapudi Narendra 2026-02-07 13:56:26 0 50
Kerala
Kerala’s Greenfield Highway & NH Upgrade Projects Now in Limbo
Two major infrastructure plans—the Kozhikode–Mysore greenfield corridor and the...
By Bharat Aawaz 2025-07-17 08:34:09 0 1K
Andhra Pradesh
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు.....
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు  అబ్దుల్ కలాం ఫౌండేషన్...
By Gadiyapudi Narendra 2025-12-26 14:41:25 0 143
Telangana
రిచ్ మాక్స్ గోల్డెన్ బ్రాంచ్ ప్రారంభం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్లో ప్రారంభమైన ప్రముఖ గోల్డ్ లోన్ కంపెనీ రిచ్ మాక్స్...
By Sidhu Maroju 2025-08-30 14:26:19 0 295
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com