గుడివాడ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ సంపూర్ణ నిషేధం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

0
113

*డిసెంబర్ 1 నుండి గుడివాడలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల సంపూర్ణ నిషేధం:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన క్లాత్ బ్యాగులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే*

 

*ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రభుత్వ నినాదం.... వ్యాపారులు,ప్రజలు సహకరించాలి*

 

*విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం వల్ల... భావితరాలకు పెను నష్టం*

 

*చేతి రుమాలు మాదిరిగానే... ప్రతి ఒక్కరు చేతి సంచిని వినియోగించాలి*

 

గుడివాడ డిసెంబర్ 21:డిసెంబర్ ఒకటో తేదీ నుండి గుడివాడ పరిపాలన సంఘ పరిధిలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రజానికం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన క్లాత్ సంచులను ఎమ్మెల్యే రాము అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ... ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న అనర్ధాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం వల్ల భావితరాలకు పెను నష్టం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రభుత్వ నినాదం అని ఎమ్మెల్యే రాము చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడివాడ పరిపాల సంఘం ప్రతిష్టాత్మకంగా మెప్మా వారి సహకారంతో తిరిగి వినియోగించేలా క్లాత్ సంచులను తయారుచేసి అందుబాటులో తేవడం అభినందనీయం అన్నారు.

 

ప్రజలు చేతులు రుమాలు మాదిరిగానే చేతి సంచిని కూడా వినియోగించాలని సూచించారు. గుడివాడలో ప్లాస్టిక్ అనేది కనబడకుండా చేయాలన్న పురపాలక సంఘ సంకల్పంలో, ప్రజల కూడా భాగస్వామ్యులై తమ వంతు సహకారం అందించి ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో బాలసుబ్రమణ్యం,కమిషనర్ ఎస్. మనోహర్, తాసిల్దార్ కుమార్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు,టిడిపి నాయకులు కంచర్ల సుధాకర్, వేసపోగు ఇమ్మానుయేలు మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: పొగాకు ముడి ఉత్పత్తులపై పన్ను సున్నా.. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ!
అన్ బ్రాండెడ్ ముడి పొగాకుపై సున్నా శాతం సుంకం బ్రాండెడ్ ఉత్పత్తులకు 18 శాతం ఎక్సైజ్ డ్యూటీ...
By Pagadala Venkateswar 2026-02-04 07:48:31 0 30
Andhra Pradesh
Chandrababu Naidu: ఎన్డీఏ నేతలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
By Pagadala Venkateswar 2026-02-06 05:14:51 0 37
Andhra Pradesh
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ కార్యాలయం నందు ఘనంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్*
మాదిగ కార్పొరేషన్ ఆఫీస్‌లో మన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్...
By John Baji 2025-12-24 13:13:13 0 106
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com