హిందూ సమ్మేళన ఆహ్వానం

0
236

Rss హిందు యాంకర్

హైందవ సమాజాన్ని బలహీనపరిచేందుకు వారిని విభజించి ఐక్యత లేకుండా చేశారని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సానా శ్రీనివాస్ విమర్శించారు. విభజన కొనసాగడం వల్ల హిందువులు ఇప్పటికే బలహీనపడ్డారని భవిష్యత్తులో మరింత దారుణంగా పరిస్థితి మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇందుకోసం హిందువులందరినీ జాగృత పరుస్తూ అన్ని ప్రాంతాల్లో సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.

 

ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళనం వాయిస్

హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో అరండల్ పేట అంకమ్మ తల్లి బస్తీలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సమయంలో ప్రధాన వక్త గా పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సానా శ్రీనివాస్ మాట్లాడుతూ హైందవ మతాన్ని బలహీనపరిచేందుకు శతాబ్దాలుగా సాగిన పాలకుల దుశ్చర్యలను ఖండించారు. కులాల పేరిట హిందూ ధర్మాన్ని సంస్కృతిని విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల జాగృత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతి ధర్మం ద్వారా సమాజాన్ని చైతన్యపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ 100 వసంవత్సరంలో ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకుని అన్ని ప్రాంతాల్లో ఈ హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. హిందువులంతా ఐక్యంగా సంస్కృతి పై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హిందూ సమ్మేళన ఆవశ్యకతను వివరించారు. ఈ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాది చొప్పర వెంకటేశ్వరరావు గురుభవాని నిమ్మని శివయ్య, మాదిరాజు ఉమా పి ఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో హోమ్ మినిస్టర్ అనిత
ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా.. నక్కపల్లిలోని నా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన...
By Rajini Kumari 2026-06-19 13:04:40 0 161
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ కమ్యూనిటీ పర్పస్ (CP) భూముల కబ్జాలపై బహుజన యువసేన (BYS) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన...
By Pagadala Venkateswar 2026-07-14 09:44:00 0 41
Telangana
అభివృద్ధిలో మంచిర్యాల రోల్ మోడల్ : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గ రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఆదివారం...
By Bonagiri RaviShankar 2026-06-14 13:37:37 0 194
Andhra Pradesh
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు – జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి...
By Pagadala Venkateswar 2026-01-25 06:42:50 0 152
Telangana
ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో
స్థానిక మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ reg.no (1630/1982)...
By Pinnehasan Odela 2026-04-25 02:51:44 0 448
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com