మహిళలకు గుడ్ న్యూస్

0
226

మహిళలకు గుడ్ న్యూస్..

 

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికులకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇవాళ(ఆదివారం) ప్రజా భవన్‌లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం సంక్షేమ పథకాల అమలుపై కీలక సూచనలు చేశారు.

 

లాభాల్లోకి ఆర్టీసీ: మల్లు భట్టి విక్రమార్క

 

మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.255 కోట్ల ట్రిప్స్ పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. పీఎం ఈ- డ్రైవ్ కింద హైదరాబాద్‌కు 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, నిజామాబాద్, వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించామని తెలిపారు. ఆర్టీసీ పీఎఫ్ బకాయిలు రూ.1,400 కోట్ల నుంచి రూ.660 కోట్లకు తగ్గించామని పేర్కొన్నారు.

 

వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజునే పుస్తకాలు, యూనిఫాంలు, షూస్ పంపిణీకి చర్యలు చేపట్టామని తెలిపారు. నాయీ బ్రాహ్మణ, రజక సంఘాలకు ఉచిత విద్యుత్ బిల్లుల నెలవారీ విడుదల చేస్తున్నామని అన్నారు. 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఒకేసారి అనుమతి ఇచ్చామని.. ఇందుకోసం కార్పొరేట్ స్థాయి భవనాల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. గురుకులాల కోసం రూ.152 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 30 వేల కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
44వ జాతీయ యోగి చాంపియన్ షిప్ 2025-2026 ప్రారంభోత్సవం
జిల్లేలమూడి శ్రీ వీళ్ళు జనని పరిషత్ అమ్మ వారి ప్రాంగణంలో ఘనంగా ప్రారంభీంచారు.ఈ కార్యక్రమం లో...
By Karapati Gopi 2025-12-27 12:21:16 0 556
Telangana
గృహజ్యోతి మాఫీ పత్రాలను అందజేసిన చంద్రం కృష్ణ గౌడ్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షులు.
మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు,జిల్లా...
By Gangaram Rangagowni 2026-01-12 10:27:52 0 187
Andhra Pradesh
మదనపల్లి: కరెంటు షాక్‌తో ఎలక్ట్రిషియన్‌కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో ఆదివారం, ఎలక్ట్రిషియన్ మహబూబ్ జానీ (38) కొత్తపల్లిలో ఒక ఇంటికి యాంటెన్నా...
By Pagadala Venkateswar 2026-03-01 09:42:22 0 88
Telangana
హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు...
By Sidhu Maroju 2026-03-03 13:56:18 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com