పూడ్చిపెట్టిన డెడ్‌బాడీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!

0
1K

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కన్న కొడుకు మృతి చెంది పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. చనిపోయిన కొడుకు డెడ్ బాడీని పూడ్చి పెట్టిన చోట కాపలా పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. కందులవారిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కన్న కొడుకు మృతి చెంది పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. చనిపోయిన కొడుకు డెడ్ బాడీని పూడ్చి పెట్టిన చోట కాపలా పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. కందులవారిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

 

కందులవారిపల్లిలో వారం రోజుల క్రితం తీవ్ర జ్వరంతో అనారోగ్యానికి గురైన కొడుకు చనిపోగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కొడుకు మృతదేహాన్ని పాతి పెట్టిన చోటుపై నిఘా పెట్టాల్సి వచ్చింది. ఏకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు తల్లిదండ్రులు. అనారోగ్యంతో గతవారం మృతి చెందిన 6 ఏళ్ల కొడుకును పోగొట్టుకున్న దుఃఖం నుంచి తేరుకోలేకపోతోంది. గ్రామ పొలిమేరలోని శ్మశానంలో ఖననం చేసిన చోటే కాపాలా పెట్టారు కుటుంబ సభ్యులు. మొదటి సంతానం కావడంతో మంత్రగాళ్ళు మృతదేహాన్ని క్షుద్రపూజల కోసం తవ్వి ఎత్తు కెళతారన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. ఆ అనుమానంతోనే కొడుకును పూడ్చిపెట్టిన చోట రూ.1500 ఖర్చు చేసి రోజూ ఇద్దరు వ్యక్తులను స్మశానం దగ్గర కాపలా కూడా ఉంచారు.

అయితే, రోజువారీగా మనుషులను కాపలాగా ఉంచి కూలీల ఖర్చు భరించలేక పోతున్న తల్లిదండ్రులు, ఇప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఖననం చేసిన ప్రదేశంలో సోలార్ ఆధారిత సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. నిరంతర నిఘా ఉంచారు. స్మశానంలో పూడ్చి పెట్టిన కొడుకు డెడ్ బాడీ ని ఎవరూ తవ్వి తీసుకెళ్లకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దీంతో కొడుకును పోగొట్టుకున్న దుఃఖంతో పాటు ఎవరు గుంతను తవ్వి తీసుకెళ్లకుండా తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూసి గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత కష్టం వచ్చిందని బాధపడుతున్నారు.

#reporter
#Tq
#EndPolio
#PulsePolio2025
#AndhraPradesh
#SivaNagendra
#pathikonda
#incharage
#kammara
#AirPollution
#IndiaAirQuality
#CleanAirIndia
#venugopal
#Environment
#NationalImmunizationDay

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా ప్రారంభమైన సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన
*స్క్రోలింగ్ కొరకు*   ఆచంట 21-12-2025     ➖ *ఘనంగా ప్రారంభమైన ఆచంట...
By Rajini Kumari 2025-12-21 14:04:18 0 181
Andhra Pradesh
ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశాలకు ఆహ్వానం
కవిటి మండలం:ఎపి మోడల్ స్కూల్ సోంపేటలో 2026-27 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశనికి విద్యార్థి...
By Jeeru Kumar 2026-02-25 08:56:11 0 305
International
A testament to the deep & long standing 🇮🇳-🇬🇭 ties.....
President John Dramani Mahama conferred upon PM Narendra Modi ‘The Officer of the Order of...
By Bharat Aawaz 2025-07-03 07:27:15 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com