పూడ్చిపెట్టిన డెడ్‌బాడీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!

0
2K

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కన్న కొడుకు మృతి చెంది పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. చనిపోయిన కొడుకు డెడ్ బాడీని పూడ్చి పెట్టిన చోట కాపలా పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. కందులవారిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కన్న కొడుకు మృతి చెంది పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. చనిపోయిన కొడుకు డెడ్ బాడీని పూడ్చి పెట్టిన చోట కాపలా పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. కందులవారిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

 

కందులవారిపల్లిలో వారం రోజుల క్రితం తీవ్ర జ్వరంతో అనారోగ్యానికి గురైన కొడుకు చనిపోగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కొడుకు మృతదేహాన్ని పాతి పెట్టిన చోటుపై నిఘా పెట్టాల్సి వచ్చింది. ఏకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు తల్లిదండ్రులు. అనారోగ్యంతో గతవారం మృతి చెందిన 6 ఏళ్ల కొడుకును పోగొట్టుకున్న దుఃఖం నుంచి తేరుకోలేకపోతోంది. గ్రామ పొలిమేరలోని శ్మశానంలో ఖననం చేసిన చోటే కాపాలా పెట్టారు కుటుంబ సభ్యులు. మొదటి సంతానం కావడంతో మంత్రగాళ్ళు మృతదేహాన్ని క్షుద్రపూజల కోసం తవ్వి ఎత్తు కెళతారన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. ఆ అనుమానంతోనే కొడుకును పూడ్చిపెట్టిన చోట రూ.1500 ఖర్చు చేసి రోజూ ఇద్దరు వ్యక్తులను స్మశానం దగ్గర కాపలా కూడా ఉంచారు.

అయితే, రోజువారీగా మనుషులను కాపలాగా ఉంచి కూలీల ఖర్చు భరించలేక పోతున్న తల్లిదండ్రులు, ఇప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఖననం చేసిన ప్రదేశంలో సోలార్ ఆధారిత సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. నిరంతర నిఘా ఉంచారు. స్మశానంలో పూడ్చి పెట్టిన కొడుకు డెడ్ బాడీ ని ఎవరూ తవ్వి తీసుకెళ్లకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దీంతో కొడుకును పోగొట్టుకున్న దుఃఖంతో పాటు ఎవరు గుంతను తవ్వి తీసుకెళ్లకుండా తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూసి గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత కష్టం వచ్చిందని బాధపడుతున్నారు.

#reporter
#Tq
#EndPolio
#PulsePolio2025
#AndhraPradesh
#SivaNagendra
#pathikonda
#incharage
#kammara
#AirPollution
#IndiaAirQuality
#CleanAirIndia
#venugopal
#Environment
#NationalImmunizationDay

Search
Categories
Read More
Telangana
ఘనంగా ఈశ్వరీ బాయి 107 జయంతి - పాల్గొన్న ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బాలికల హక్కుల కోసం,100 ఏళ్ళ క్రితమే ఆంక్షలు,లింగ...
By Sidhu Maroju 2025-12-01 07:13:55 0 216
Andhra Pradesh
త్రిపురాంతకం  మండల కేంద్రం, అదేవిధంగా రాజుపాలెం స్వర్ణ గ్రామకార్యాలయాల్లో సర్ ప్రోగ్రాం
త్రిపురాంతకం  మండల కేంద్రం,  అదేవిధంగా రాజుపాలెం స్వర్ణ గ్రామకార్యాలయాల్లో సర్...
By Chennaiah Kati 2026-07-12 17:53:33 0 67
Madhya Pradesh
Monsoon Rains Boost Farming Activity in Madhya Pradesh
The steady advance of the southwest monsoon across Madhya Pradesh has brought significant relief...
By Navya Sree 2026-06-27 05:21:47 0 36
SURAKSHA
S. Suresh Kumar IAS: Advancing Education Through Governance
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in school education, digital...
By Lokeshwari Panthadi 2026-07-16 09:23:49 0 47
Telangana
"కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ ప్రారంభం
🎤కుమురం భీం ఆసిఫాబాద్: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్ కార్ జగదీష్  ఎండలు తీవ్రంగా...
By Chunarkar Jagadeesh 2026-05-17 02:32:44 0 484
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com