అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ మఠం పీఠాధిపతి!!

0
165

కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ధార్మిక పర్యటనలో భాగంగా కేరళ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. అనంతరం కేరళ రాజభవన్ కు చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులకు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గవర్నర్‌కు రాఘవేంద్ర స్వామి మఠం తరపున శేష వస్త్రం, జ్ఞాపిక , పలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆయన వెంట శ్రీమఠం ప్రత్యేక అధికారి కృష్ణ కౌశిక్ ఆచార్, రాజా అప్రమేయ ఆచార్, వేద పండితులు ఉన్నారు.

Search
Categories
Read More
Telangana
భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ... మెదక్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా లో నాలుగు మున్సిపాలిటీలలో ప్రశాంతమైన వాతావరణంలో మొదలైన ఓటింగ్ మొదలైంది. జిల్లాలోని...
By Gangaram Rangagowni 2026-02-11 02:25:12 0 46
Andhra Pradesh
నులిపురుగుల నివారణ పై అవగాహన
*విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ*   ****************************** మంగళగిరి...
By Rajini Kumari 2026-02-17 10:43:37 0 44
Telangana
నార్త్ జోన్ పరిధిలో చోరీ ఐన 111 సెల్ ఫోన్ లు రికవరీ: బాధితులకు అందజేసిన డీసీపీ రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకోవడంతోపాటు చోరీకి గురైన కేసులలో పోలీసులు...
By Sidhu Maroju 2025-11-01 16:27:23 0 138
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com