ఇంటర్ వార్షిక పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలి

0
309

ఎస్ఐ రాజు కుమార్

 

 

మహబూబాబాద్ జిల్లా,డిసెంబర్ 20(భారత్ అవాజ్):  కొత్తగూడ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడ ఎస్ఐ రాజు కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు....

 

*ఈ సందర్భంగా ఎస్ఐ రాజు కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షల సమయంలో భయాందోళనలకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ రోజువారీ అధ్యయన ప్రణాళిక రూపొందించుకోవాలని, అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలని తెలిపారు. అలాగే చెడు అలవాట్లు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు*.

 

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా ఉపాధ్యాయులను సంప్రదించాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు తగ్గుముఖం.
మదనపల్లి టమోటా మార్కెట్‌లో ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఆదివారం 1,630 మెట్రిక్ టన్నుల టమోటా...
By Pagadala Venkateswar 2026-06-29 08:05:47 0 58
Telangana
పాలు పలిగాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూకట్ పల్లి పోలీసులు
కూకట్‌పల్లిలో హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు. ...
By Sidhu Maroju 2025-06-24 12:38:15 0 1K
Himachal Pradesh
IMD Issues Rain Alert Across Himachal Pradesh
The India Meteorological Department (IMD) has issued rainfall alerts for Himachal Pradesh as...
By Navya Sree 2026-06-26 08:50:09 0 104
Andhra Pradesh
కార్మికులకు జీతాలు పెంచలేని ప్రభుత్వానికి సంబరాలెందుకు?: CITU.
కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ...
By Pagadala Venkateswar 2026-06-22 06:54:51 0 89
Andhra Pradesh
సహకార సంస్థల అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా నూతనంగా నియమితులైన శ్రీ కుర్రా అప్పారావు సోమవారం గుంటూరు...
By John Baji 2025-12-30 01:20:59 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com