ఇంటర్ వార్షిక పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలి

0
263

ఎస్ఐ రాజు కుమార్

 

 

మహబూబాబాద్ జిల్లా,డిసెంబర్ 20(భారత్ అవాజ్):  కొత్తగూడ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడ ఎస్ఐ రాజు కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు....

 

*ఈ సందర్భంగా ఎస్ఐ రాజు కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షల సమయంలో భయాందోళనలకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ రోజువారీ అధ్యయన ప్రణాళిక రూపొందించుకోవాలని, అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలని తెలిపారు. అలాగే చెడు అలవాట్లు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు*.

 

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా ఉపాధ్యాయులను సంప్రదించాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Telangana
అల్వాల్‌లో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రోటోకాల్ వివాదం.. ఎంఆర్ఓకు కాంగ్రెస్ నేత ఫిర్యాదు. |
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్...
By Sidhu Maroju 2026-03-16 12:02:03 0 147
Andhra Pradesh
CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం.
AP: అమరావతిలో CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్షిక రుణ...
By Pagadala Venkateswar 2026-01-23 07:00:17 0 111
Telangana
​భద్రాచలం బస్టాండ్‌లో మొబైల్ దొంగకు దేహశుద్ధి: పోలీసులకు అప్పగింత
భద్రాచలం:భద్రాచలం పట్టణంలోని ప్రధాన బస్టాండ్ ఆవరణలో ఆదివారం రాత్రి  ఒక మొబైల్ దొంగతనం కలకలం...
By Lakavath Kiran 2026-03-16 03:04:17 0 361
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com