ఇంటర్ వార్షిక పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలి

0
231

ఎస్ఐ రాజు కుమార్

 

 

మహబూబాబాద్ జిల్లా,డిసెంబర్ 20(భారత్ అవాజ్):  కొత్తగూడ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడ ఎస్ఐ రాజు కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు....

 

*ఈ సందర్భంగా ఎస్ఐ రాజు కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షల సమయంలో భయాందోళనలకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ రోజువారీ అధ్యయన ప్రణాళిక రూపొందించుకోవాలని, అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలని తెలిపారు. అలాగే చెడు అలవాట్లు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు*.

 

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా ఉపాధ్యాయులను సంప్రదించాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన మంత్రి మండిపల్లి
ఈరోజు రాయచోటి మండిపల్లి భవన్ నందు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదిన...
By Benguluri Madhubabu 2026-01-23 06:10:29 0 209
Andhra Pradesh
కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !!
కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా...కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో 77 వ  గణతంత్ర ...
By Hari Krishna 2026-01-26 08:36:59 0 262
Andhra Pradesh
అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి..
బాపట్ల: అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి, దేశవ్యాప్తంగా బడ్జెట్ పెంపుదల...
By Gadiyapudi Narendra 2026-02-03 16:04:03 0 194
Andhra Pradesh
నాన్నగారు మందలించాడని కోపంతో అలిగి సైకిల్ పై ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్లిపోయినాడు.
వేటపాలెం: తండ్రి మందలించాడనే కోపంతో వేటపాలెం కు చెందిన గుత్తి సిద్ధార్థ అనే బాలుడు ఇంటి నుండి...
By Gadiyapudi Narendra 2026-02-03 16:21:06 0 370
Andhra Pradesh
నేడు శంబర పోలమాంబ చివరి వారం జాతర
ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర...
By Boiena Rajesh 2026-03-31 07:55:08 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com