ఇంటర్ వార్షిక పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలి

0
232

ఎస్ఐ రాజు కుమార్

 

 

మహబూబాబాద్ జిల్లా,డిసెంబర్ 20(భారత్ అవాజ్):  కొత్తగూడ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడ ఎస్ఐ రాజు కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు....

 

*ఈ సందర్భంగా ఎస్ఐ రాజు కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షల సమయంలో భయాందోళనలకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ రోజువారీ అధ్యయన ప్రణాళిక రూపొందించుకోవాలని, అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలని తెలిపారు. అలాగే చెడు అలవాట్లు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు*.

 

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా ఉపాధ్యాయులను సంప్రదించాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
By Pagadala Venkateswar 2026-01-28 10:22:04 0 82
Andhra Pradesh
సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్
సియం ఎక్స్అఫిషియో స్పెషల్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్ అమరావతి,2 మార్చి:సియం...
By Rajini Kumari 2026-03-02 11:09:32 0 89
Telangana
కల్తీ ఆహారంపై సీపీ సజ్జనర్ వార్నింగ్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
హైదరాబాద్: నగరంలో ఆహార పదార్థాలలో కల్తీపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్...
By Sidhu Maroju 2026-04-02 19:38:36 0 97
Telangana
అటల్ బిహారీ వాజ్‌పేయి (25 డిసెంబర్ 1924 – 16 ఆగస్టు 2018): రాజకీయాల్లో కవిత్వం, నాయకత్వంలో మానవత్వం - Reshma Mohammed
అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు — రాజకీయం అంటే సేవ, ధైర్యం,...
By Reshma Mohammed 2025-12-25 16:56:43 0 668
Telangana
ప్రజల కష్టాలు - సివరేజ్ పనులకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
By Sidhu Maroju 2026-02-10 13:06:06 0 123
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com