నర్స్ వృత్తి అమ్మ చేసే సేవ లాంటిదే- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
190

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఈశ్వరీ బాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఫేర్ వెల్ & ఫ్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం మారేడ్ పల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో కళాశాల యాజమాన్యం వారు నిర్వహించారు . ఈ వేడుకలకు యాజమాన్యం ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

వేదికపై విద్యార్ధినీ, విద్యార్ధులకు మెరిట్ స్కాలర్ షిప్ లు, అకడమిక్ సర్టిఫికెట్ లను ఎమ్మెల్యే అందజేశారు.

 అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజానికి సేవ చేసే అదృష్టం నర్సు ల రూపంలో మీకు వచ్చిందని, హాస్పటల్స్ లో మీది తల్లి పాత్ర వంటిదని, మీ సేవల ద్వారా ప్రజలకు ఆత్మీయులుగా మారి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, కళాశాల యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు.

పేద, మధ్యతరగతి విద్యార్ధినీ , విద్యార్ధులకు అందుబాటులో మంచి విద్యని అందిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రా రెడ్డి, డాక్టర్ కృష్ణా రెడ్డి, శ్రీమతి మేఘనా రెడ్డి గార్లకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ షైనీ జాన్, స్కూల్ హెడ్ విజిత వాణి, కాంగ్రెస్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, అరవింద్ యాదవ్ లు పాల్గొన్నారు.

Sidhumaroju    Farewell Pressures Day celebrations

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు :పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
పుంగనూరు పట్టణ పరిధిలోని తాటిమాకులపాళ్యంకు చెందిన భానుమూర్తి ఆచారి (31) అనే యువకుడు ఇంటి నుంచి...
By Kothuru Murali 2026-05-09 14:50:50 0 52
Telangana
Spandana takshana rakshana teams
హైదరాబాద్‌ ఐసీసీసీ వేదికగా 'స్పందన' తక్షణ రక్షణ బృందాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న...
By G k Nookala 2026-04-27 12:02:35 0 121
Andhra Pradesh
కాలుష్య రహిత నగరానికి మరో అడుగు
*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ*   *19-12-2025*   *కాలుష్య రహిత నగరానికి...
By Rajini Kumari 2025-12-19 12:26:36 0 194
Andhra Pradesh
#petrol yuddam
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో పెట్రోల్ యుద్దం వాహనదారులు ఇబ్బందులు
By Kokkiligadda Suresh 2026-04-27 08:24:08 0 294
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-14 10:47:41 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com