పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో విశేష నిత్య పూజలు భారీగా పెరిగిన భక్తుల తాకిడి

0
184

*పత్రికా ప్రకటన*         

 

*ఇంద్రకీలాద్రి,19 డిసెంబర్ 2025*

 

పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరులకు, పరివార దేవతలకు ఈరోజు విశేష నిత్య పూజలు వైభవంగా జరిగాయి.

 

అమావాస్య,శుక్రవారం సందర్బంగా ఆది దంపతుల సన్నిధిలో వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు విసృతంగా పాల్గొన్నారు.

సుప్రభాత సేవ,ఖడ్గమాలార్చన,

లక్ష కుంకుమార్చన, చండీ యాగం, శ్రీ చక్ర నవావరణార్చన, శాంతి కళ్యాణం, అష్టోత్తరం, సహస్ర నామం తదితర పూజల్లో విశేషరీతిలో భక్తులు పాల్గొన్నారు.

 

శుక్రవారం రద్దీ సందర్బంగా ప్రతీ ఒక్క భక్తునికీ శ్రీ దుర్గామల్లేశ్వరుల దర్శనం సులభతరంగా పూర్తి అవ్వాలని ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ వార్ల ఆదేశాలకనుగుణంగా దేవాలయ సిబ్బంది క్యూ లైన్ల క్రమబద్దీకరణ, రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఉదయం నుండే రూ. 500/- టిక్కెట్ అంతరాలయ దర్శనం క్యూ వేగం గా,

వివిధ దర్శనం క్యూలైన్లు కూడా వేగంగా నడిచేలా చర్యలు తీసుకోవడమైనది.

వివిధ క్యూ మార్గాల ద్వారా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని దేవస్థానం అందిస్తున్న ఉచిత లడ్డు ప్రసాదము, నిత్య అన్నప్రసాదమును భక్తి శ్రద్దలతో స్వీకరించారు.

 

 ఉచిత లడ్డు ప్రసాద వితరణ నిరంతరం కొనసాగింది.ఉపాలయాలలో భక్తుల రద్దీ కి తగ్గట్లు ఏర్పాట్లు చేయడమైనది.దేవస్థానం సిబ్బంది, సేవాదారుల సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకుని భక్తులకు ఏ ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయడమైనది.

ఆన్లైన్ సేవల పెంపుదల, డిజిటల్ పేమెంట్స్ స్వీకరణ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో భక్తులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. కేశ ఖండన టిక్కెట్, ప్రసాదాల కొనుగోలు, దర్శనం టికెట్, విరాళాలు చెల్లింపులు సైతం ఆన్ లైన్ ద్వారా జరుగుతున్నాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో ఘనంగా రాములవారి కల్యాణ ఉత్సవాలు
సోమల మండలంలోని వివిధ గ్రామాలలో రాములవారి కల్యాణ ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ...
By Kothuru Murali 2026-03-27 14:52:01 0 131
Andhra Pradesh
A P in tirupathi royal Enfield project
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో...
By G k Nookala 2026-05-18 17:24:46 0 46
Andhra Pradesh
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్‌ బస్సు.. 9 మంది మృతి
 రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం...
By SivaNagendra Annapareddy 2025-12-12 11:45:57 1 426
Technology
OpenAI Initiates Major Product Team Restructuring
In its latest internal shake-up, OpenAI is planning to consolidate ChatGPT, its developer-facing...
By Dunna Jessicaruth 2026-05-18 12:11:56 0 36
Andhra Pradesh
మార్క్ టల్లి మరణం మీడియా లోకానికి తీరని లోటు
ప్రముఖ రచయిత జర్నలిస్టు మార్క్ టిల్లీ l భారతీయ అసలు సిసలు వ్యాఖ్యాత మార్క్ ఢిల్లీ కన్నుమూశారు...
By Benguluri Madhubabu 2026-01-26 07:08:17 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com