పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో విశేష నిత్య పూజలు భారీగా పెరిగిన భక్తుల తాకిడి

0
156

*పత్రికా ప్రకటన*         

 

*ఇంద్రకీలాద్రి,19 డిసెంబర్ 2025*

 

పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరులకు, పరివార దేవతలకు ఈరోజు విశేష నిత్య పూజలు వైభవంగా జరిగాయి.

 

అమావాస్య,శుక్రవారం సందర్బంగా ఆది దంపతుల సన్నిధిలో వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు విసృతంగా పాల్గొన్నారు.

సుప్రభాత సేవ,ఖడ్గమాలార్చన,

లక్ష కుంకుమార్చన, చండీ యాగం, శ్రీ చక్ర నవావరణార్చన, శాంతి కళ్యాణం, అష్టోత్తరం, సహస్ర నామం తదితర పూజల్లో విశేషరీతిలో భక్తులు పాల్గొన్నారు.

 

శుక్రవారం రద్దీ సందర్బంగా ప్రతీ ఒక్క భక్తునికీ శ్రీ దుర్గామల్లేశ్వరుల దర్శనం సులభతరంగా పూర్తి అవ్వాలని ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ వార్ల ఆదేశాలకనుగుణంగా దేవాలయ సిబ్బంది క్యూ లైన్ల క్రమబద్దీకరణ, రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఉదయం నుండే రూ. 500/- టిక్కెట్ అంతరాలయ దర్శనం క్యూ వేగం గా,

వివిధ దర్శనం క్యూలైన్లు కూడా వేగంగా నడిచేలా చర్యలు తీసుకోవడమైనది.

వివిధ క్యూ మార్గాల ద్వారా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని దేవస్థానం అందిస్తున్న ఉచిత లడ్డు ప్రసాదము, నిత్య అన్నప్రసాదమును భక్తి శ్రద్దలతో స్వీకరించారు.

 

 ఉచిత లడ్డు ప్రసాద వితరణ నిరంతరం కొనసాగింది.ఉపాలయాలలో భక్తుల రద్దీ కి తగ్గట్లు ఏర్పాట్లు చేయడమైనది.దేవస్థానం సిబ్బంది, సేవాదారుల సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకుని భక్తులకు ఏ ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయడమైనది.

ఆన్లైన్ సేవల పెంపుదల, డిజిటల్ పేమెంట్స్ స్వీకరణ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో భక్తులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. కేశ ఖండన టిక్కెట్, ప్రసాదాల కొనుగోలు, దర్శనం టికెట్, విరాళాలు చెల్లింపులు సైతం ఆన్ లైన్ ద్వారా జరుగుతున్నాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని...
By Sidhu Maroju 2025-06-21 17:38:24 0 1K
Andhra Pradesh
జిల్లాలో ప్రతి మహిళ ఎంటర్ పెన్యూర్ గా రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాద్ లక్ష్యం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య
*ప్ర‌చుర‌ణార్థం* 14-12-2025*    *జిల్లాలో ప్ర‌తి మ‌హిళ‌...
By Rajini Kumari 2025-12-15 08:14:07 0 218
Andhra Pradesh
నూతన అధ్యక్షులకు పూలదండతో సత్కరిస్తున్న కమిటీ సభ్యులు బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరి.
బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా...
By Gadiyapudi Narendra 2026-02-11 17:01:04 0 120
Andhra Pradesh
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది 'పద్మశ్రీ'ల జాబితా ఇదిగో!
  Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది...
By Pagadala Venkateswar 2026-01-26 06:55:46 0 108
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్లో తగ్గిన టమాటా ధరలు.
ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన...
By Pagadala Venkateswar 2026-02-27 09:07:40 0 74
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com