కౌకూర్ లో బోనాల పండగ జాతర. పూజలు చెల్లించుకున్న కాంగ్రెస్ నేతలు

0
1K

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/కౌకూర్.  

బోనాలు తెలంగాణ లో జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. ఇది ప్రధానంగా మహంకాళి అమ్మవారికి అంకితం చేయబడింది. బోనాల పండుగలో ఘటం ఊరేగింపు కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రత్యేమైన కలశం. దీనిని వూరేగింపుగా అమ్మవారి వద్దకు తీసుకెళతారు. ఈ వూరేగింపుతో మొదటి రోజు బోనాల సమర్పణ ద్వారా ముగుస్తుంది. మరుసటి రోజున రగం అనే కార్యక్రమం జరుగుతుంది.ఒక స్త్రీ మహంకాళి దేవతను తనపైకి ఆహ్వానించి భవిష్యవాణి చెపుతుంది. పోతరాజు అమ్మవార్లకు తమ్ముడు అంటారు. అతను ఈ పండుగలో ఆనందంగా ప్రతేక ఆకర్షణగా నిలుస్తాడు. ఈ పండుగలోఅనేక ఇతర సాంప్రదాయాలు..ఒగ్గు కథ, పాలబండి, గుర్రపు బగ్గి, పోతరాజు విన్యాసాలు భక్తులలో భక్తి పారవస్యాలు నింపుతాయి. ఈ పండుగను పురస్కరించుకొని కౌకూరులో జరిగిన బోనాల పండగ కార్యక్రమానికి ఆల్వాల్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు వుంటాయని అయన తెలియచేసారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మి కాంత్ రెడ్డి, పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.  జెకె కాలనీ జనరల్ సెక్రెటరీ ప్రదీప్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీశైలం యాదవ్, సర్వేష్ యాదవ్, దిండ్లస్వామి, వి.వి.రావు, దేవేందర్,  స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-సిద్దుమారోజు ✍️

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ లో రోడ్డు విస్తరణలో భాగంగా, మున్సిపల్ అధికారులు, చేపట్టిన కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-30 09:30:03 0 137
Maharashtra
Maharashtra Expands Sports Development Across the State
Maharashtra continues to strengthen its sports ecosystem through investments in modern...
By Fathima Safa 2026-07-02 09:48:48 0 52
Andhra Pradesh
కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు కూటమి...
By Chennaiah Kati 2026-07-22 15:38:59 0 29
Andhra Pradesh
పనిభారం, ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య: నిరసన తెలిపిన సంఘం
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సోమవారం నల్ల బ్యాడ్జీలు...
By Kothuru Murali 2026-06-08 14:29:04 0 72
Andhra Pradesh
పశ్చిమగోదావరి జిల్లా డివైడర్ను ఢీ కొట్టి నా బైక్ ప్రమాదంలో ముగ్గురు మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పెనుమంట్ర మండలం పోలమూరు వద్ద ఓవర్ స్పీడ్ తో...
By Rajini Kumari 2025-12-23 10:04:04 0 417
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com