కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటి తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ

0
175

*ఢిల్లీ*

 

*కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*

• రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. 

• ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో పాటిల్‌ను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు.

• ఆంధ్రప్రదేశ్‌కు నీటి భద్రత అత్యంత కీలక అంశమని... రాష్ట్రంలో సాగునీటి-తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

• ప్రాజెక్టులపై కేంద్ర–రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఉందన్నారు.

*జల్ జీవన్ మిషన్*

• 2025-26 ఆర్ధిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. 

• జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.524.41 కోట్లు ఖర్చు చేశామని, అలాగే దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని సీఎం కోరారు.  

*PMKSY – RRR పథకం:*

• ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పాటిల్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు. 

• ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 

*పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ :*

• పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగులో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.

• రెండో దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. 

*వంశధార నది వివాద ట్రిబ్యునల్ (VWDT):*

• వంశధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. 

• ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా, ట్రిబ్యునల్ నిర్ణయాల అమలుకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై తక్షణమే కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు. 

*ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశం :*

• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచాలని భావిస్తోందని, దీనికి సంబంధించి భూసేకరణకు కూడా సిద్ధమైందని సీఎం అన్నారు. 

• అయితే ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున కర్నాటక ప్రభుత్వం దీనిపై ముందుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిలువరించాలని పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: జనసేన సభ్యత్వం కుటుంబానికి భరోసా: ఎన్. వి. ఆర్
పుంగనూరు మండలం, చదళ్ల గ్రామంలో జనసేన పార్టీ నేత వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం...
By Kothuru Murali 2026-02-25 09:47:49 0 106
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలకు అంగరంగ వైభవంగా సిద్దమైన RCM, ఆంధ్ర బాపిస్ట్ చర్చ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో "క్రిస్మస్" వేడుకలు ఘనంగా...
By BABJI DADALA 2025-12-24 14:35:32 0 339
Telangana
ప్రాణ రక్షణే లక్ష్యం- అల్వాల్ లో మార్మోగిన "అరైవ్ అండ్ అలైవ్" నినాదం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం...
By Sidhu Maroju 2026-01-16 15:08:36 0 187
Telangana
నిజామాబాద్.పదవ తారారతి పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ నిషేదం
మార్చి 14 నుండీ జరిగే 10వతరగతి పరీక్షలను పకడ్బంధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఇ  ఎల్...
By Sadaq Sadaq 2026-02-24 17:15:59 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com