కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటి తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ

0
215

*ఢిల్లీ*

 

*కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*

• రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. 

• ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో పాటిల్‌ను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు.

• ఆంధ్రప్రదేశ్‌కు నీటి భద్రత అత్యంత కీలక అంశమని... రాష్ట్రంలో సాగునీటి-తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

• ప్రాజెక్టులపై కేంద్ర–రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఉందన్నారు.

*జల్ జీవన్ మిషన్*

• 2025-26 ఆర్ధిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. 

• జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.524.41 కోట్లు ఖర్చు చేశామని, అలాగే దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని సీఎం కోరారు.  

*PMKSY – RRR పథకం:*

• ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పాటిల్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు. 

• ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 

*పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ :*

• పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగులో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.

• రెండో దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. 

*వంశధార నది వివాద ట్రిబ్యునల్ (VWDT):*

• వంశధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. 

• ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా, ట్రిబ్యునల్ నిర్ణయాల అమలుకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై తక్షణమే కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు. 

*ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశం :*

• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచాలని భావిస్తోందని, దీనికి సంబంధించి భూసేకరణకు కూడా సిద్ధమైందని సీఎం అన్నారు. 

• అయితే ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున కర్నాటక ప్రభుత్వం దీనిపై ముందుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిలువరించాలని పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

Search
Categories
Read More
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:14:47 0 236
Andhra Pradesh
అసాంఘిక కార్యకలాపాలపై విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అసాంఘిక...
By Pagadala Venkateswar 2026-04-19 04:32:12 0 110
Andhra Pradesh
కనకమెడల రవీంద్ర కు అభినందనలు తెలిపినmP కేశినేని గద్దె రామ్మోహన్
*ప్రచుర‌ణార్థం* *24-12-2025*   క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్రకు...
By Rajini Kumari 2025-12-25 07:40:40 0 187
Telangana
దంతేపల్లి గ్రామంలో సిసి రోడ్ పనులు ప్రారంభం...
రామయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో బుధవారం రోడ్డు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి...
By Katiyala JeevanRaj 2026-04-08 10:36:07 0 325
Bharat Aawaz
Article 11 – Citizenship Laws Are in the Hands of Parliament
What Is Article 11 All About? While the Constitution (Part II) talks about who is a...
By Citizen Rights Council 2025-06-26 12:56:38 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com