కేంద్ర పోర్టులు షిప్పింగ్ జల రవాణా మంత్రి సత్యానంద సోనో వాల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ

0
177

*ఢిల్లీ*

 

*కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ*

 

*దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై సోనోవాల్‌తో చర్చించిన సీఎం చంద్రబాబు*

 

*దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు.*

 

*“చిప్ టు షిప్” విజన్‌కు అనుగుణంగా షిప్‌బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని వినతి.*

 

*దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలి : సీఎం చంద్రబాబు*

• దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ & షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. 

• ఈ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు అంగీకారం. 

• ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR) సిద్ధమైంది.

• నౌక నిర్మాణానికి అనుబంధ MSME యూనిట్లు, కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సమగ్ర క్లస్టర్‌గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు.

• ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత. 

• దుగరాజపట్నాన్ని నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌గా త్వరితగతిన ఆమోదించాలని కేంద్రాన్ని కోరిన సీఎం.

 

*ఫిషింగ్ హార్బర్లకు కేంద్రం సాయం చేయాలి : సీఎం చంద్రబాబు*

• ఫేజ్–1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని కోరిన ముఖ్యమంత్రి

• మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామన్న సీఎం 

• ఫేజ్–1లో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను రూ.1361.49 కోట్లతో చేపట్టామని వివరించిన ముఖ్యమంత్రి 

• జువ్వలదిన్నె హార్బర్‌కు మాత్రమే కేంద్రం నుంచి రూ.138.29 కోట్లు మంజూరు అయ్యాయని వెల్లడి

• ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.782.29 కోట్లు ఖర్చు చేసిందని వివరించిన సీఎం

• మిగిలిన మూడు హార్బర్లకు కేంద్ర సాయం ఇంకా అందలేదు. 

• ఫేజ్–1 పూర్తి కోసం ఇంకా రూ.440.91 కోట్లు అవసరం ఉంది. 

• ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి.

• మొత్తం మీద రూ.590.91 కోట్లు కేంద్రం నుంచి సహాయంగా అందాల్సి ఉందని తెలియజేసిన సీఎం చంద్రబాబు.

Search
Categories
Read More
Andhra Pradesh
అపూర్వం ఆదర్శనీయం పండిత రాంప్రసాద్ బిస్మిల్ ఆస్మా కుల్లాహ్ కాన్ల స్నేహబంధం
ఆంగ్లేయుల చే 1927 డిసెంబర్ 19 న ఉరితీయబడిన " పండిత రాంప్రసాద్ బిస్మిల్ - అష్ఫాఖుల్లాహ్ ఖాన్ "ల...
By Rajini Kumari 2025-12-18 08:16:17 0 159
Goa
Cashew Yield in South Goa Halves as Weather Patterns Disrupt Crop Cycle
South Goa’s cashew production has dropped by approximately 50%, driven by unfavorable...
By Bharat Aawaz 2025-07-17 06:26:34 0 1K
Andhra Pradesh
రామసముద్రం: బండరాయిని ఢీకొన్న బైక్ వ్యక్తికి గాయాలు.
రామసముద్రం - పుంగనూరు రహదారిలోని గాంధీనగర్ సమీపంలో సోమవారం సాయంత్రం ఒక బైక్ అదుపుతప్పి రహదారి...
By Pagadala Venkateswar 2026-02-17 05:23:47 0 122
Andhra Pradesh
రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు
  రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు తప్ప,...
By John Baji 2026-01-01 01:56:47 0 130
Andhra Pradesh
మదనపల్లిలో ఆస్తి వివాదం: రక్తసంబంధీకుల మధ్య దాడులు.
మదనపల్లిలో ఆస్తి తగాదాలు తీవ్రమయ్యాయి. పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన వేములయ్య కుటుంబంలో ఆస్తి...
By Pagadala Venkateswar 2026-02-28 11:14:41 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com