కేంద్ర పోర్టులు షిప్పింగ్ జల రవాణా మంత్రి సత్యానంద సోనో వాల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ

0
222

*ఢిల్లీ*

 

*కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ*

 

*దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై సోనోవాల్‌తో చర్చించిన సీఎం చంద్రబాబు*

 

*దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు.*

 

*“చిప్ టు షిప్” విజన్‌కు అనుగుణంగా షిప్‌బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని వినతి.*

 

*దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలి : సీఎం చంద్రబాబు*

• దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ & షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. 

• ఈ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు అంగీకారం. 

• ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR) సిద్ధమైంది.

• నౌక నిర్మాణానికి అనుబంధ MSME యూనిట్లు, కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సమగ్ర క్లస్టర్‌గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు.

• ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత. 

• దుగరాజపట్నాన్ని నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌గా త్వరితగతిన ఆమోదించాలని కేంద్రాన్ని కోరిన సీఎం.

 

*ఫిషింగ్ హార్బర్లకు కేంద్రం సాయం చేయాలి : సీఎం చంద్రబాబు*

• ఫేజ్–1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని కోరిన ముఖ్యమంత్రి

• మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామన్న సీఎం 

• ఫేజ్–1లో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను రూ.1361.49 కోట్లతో చేపట్టామని వివరించిన ముఖ్యమంత్రి 

• జువ్వలదిన్నె హార్బర్‌కు మాత్రమే కేంద్రం నుంచి రూ.138.29 కోట్లు మంజూరు అయ్యాయని వెల్లడి

• ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.782.29 కోట్లు ఖర్చు చేసిందని వివరించిన సీఎం

• మిగిలిన మూడు హార్బర్లకు కేంద్ర సాయం ఇంకా అందలేదు. 

• ఫేజ్–1 పూర్తి కోసం ఇంకా రూ.440.91 కోట్లు అవసరం ఉంది. 

• ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి.

• మొత్తం మీద రూ.590.91 కోట్లు కేంద్రం నుంచి సహాయంగా అందాల్సి ఉందని తెలియజేసిన సీఎం చంద్రబాబు.

Search
Categories
Read More
Telangana
మహనీయులకు ఘన నివాళి.|
"జ్ఞానమాల కార్యక్రమంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గద్దర్ ఆశయాల స్మరణ" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-06 13:13:46 0 90
Andhra Pradesh
పరుగులు పెడుతున్న డోన్ నియోజకవర్గ అభివృద్ధి పనులు :
కర్నూలు :  డోన్ డోన్ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది....
By Hari Krishna 2026-01-05 06:09:36 0 221
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్‌పై ముద్రగడ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వ హయాంలోని అభివృద్ధిని జగన్ తట్టుకోలేకపోతున్నారన్న ముద్రగడ కుమార్తె క్రాంతి ...
By Pagadala Venkateswar 2026-02-04 07:42:22 0 156
Telangana
హైడ్రా భూ వివాదంలో ఆర్మీ రక్షణకు హైకోర్టు ఆదేశం.|
● లోతుకుంట భూమి వివాదంలో కీలక ఆదేశాలు. ● కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై హైడ్రా కమిషనర్‌పై...
By Sidhu Maroju 2026-07-23 12:19:02 0 33
Andhra Pradesh
వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద బోల్తా పడిన గడ్డివాము ట్రాక్టర్ * ప్రమాదకరంగా మారుతున్న అధికంగా లోడ్ వాహనాలు
బాపట్ల జిల్లా పరిధిలోని వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద గురువారం ఒక ప్రమాదం చోటుచేసుకుంది. గడ్డివాముతో...
By Vadlamudi NagaVenkat 2026-03-12 14:34:41 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com