Gold, Silver Prices: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు!!!!!

0
180

Gold, Silver Prices: దేశీయ డిమాండ్ నుండి ప్రపంచ ఉద్రిక్తతలు, ఇతర అంశాల వరకు అనేక ప్రధాన కారణాలు వెలుగులోకి వచ్చాయి. వెండి ధరల పెరుగుదలకు పారిశ్రామిక డిమాండ్ ప్రధాన కారణమని నమ్ముతారు. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, గ్రీన్..

 

Gold, Silver Prices: ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పుచేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపు ధర పెరుగుతోంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఇప్పుడు పది గ్రాముల బంగారం కొనాలంటేనే లక్షా 35 వేల వరకు చెల్లించుకోవాల్సిందే.

 

అయితే ప్రతి రోజు ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు అప్‌డేట్‌ అవుతుంటాయి. ఈ సమయంలో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రస్తుతం శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 660 రూపాయల వరకు తగ్గింది. దీంతో ఇప్పుడు తులం ధర రూ.1,34,180 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. అందుకే చాలా మంది బంగారం, వెండి కొనుగోలులో బిజీగా ఉన్నారు. చాలా మంది వ్యక్తిగత ఉపయోగం కోసం, వారి భవిష్యత్తు కోసం కూడా బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. మీరు కూడా ఇలాంటిదే ఆలోచిస్తుంటే, కొనుగోలు చేసే ముందు బంగారం, వెండి ధరలను ఖచ్చితంగా తనిఖీ చేయాలి.

ఇక వెండి ధరల్లో ఈ గణనీయమైన పెరుగుదల కొనసాగుతోంది. వెండి కూడా ఏ మాత్రం తగ్గకుండా పరుగులు పెడుతోంది. అయితే ప్రస్తుతం మాత్రం కిలో వెండిపై ఏకంగా రూ.2000 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర దేశీయంగా రూ.2,09,000 వద్ద ఉంది.

 

ఇక హైదరాబాద్‌, చెన్నై, కేరళ ప్రాంతాల్లో అయితే ధర భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,21,000 వద్ద కొనసాగుతోంది. దేశీయ డిమాండ్ నుండి ప్రపంచ ఉద్రిక్తతలు, ఇతర అంశాల వరకు అనేక ప్రధాన కారణాలు వెలుగులోకి వచ్చాయి. వెండి ధరల పెరుగుదలకు పారిశ్రామిక డిమాండ్ ప్రధాన కారణమని నమ్ముతారు. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలలో వెండికి బలమైన డిమాండ్ దాని నిరంతర పెరుగుదలకు దారితీసింది.

 

#Sivanagendra #Trending #Bharathaawaz #Newscoordinator 

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీవారి లడ్డుపై నిజాల ఆవిష్కరణ
*📢 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిజాల ఆవిష్కరణ! 🙏*   కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి...
By Rajini Kumari 2026-02-28 11:49:52 0 92
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్స్ ను పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ లో భాగంగా నడి రోడ్డు లో మీద పేరెడ్ నిర్వహించారు.
  >కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు    గుంటూరు జిల్లా పోలీస్... తేది :...
By KOTESWARARAO KVSR 2026-01-10 15:40:06 0 301
Andhra Pradesh
రూ.32,52,064 సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. - కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది. - కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. - కార్యకర్తలకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
31 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.32,52,064 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి...
By Ratna Sekhar 2026-03-11 07:08:32 0 103
Andhra Pradesh
కూట‌మి పాల‌న‌లో స్కీంలు లేవు..అన్నీ స్కాంలే
వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ...
By mahaboob basha 2025-07-19 12:47:15 0 970
Andhra Pradesh
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
By Bharat Aawaz 2025-05-28 14:43:50 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com