జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేస్తే ఊరుకోం.|

0
206

 

 

 సికింద్రాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీ వికామిషన్ - గ్రామీణ్ ( వీబీ - జీ - రామ్ - జీ) పేరుతో బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టడాన్ని,ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ DCC అధ్యక్షులు దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ MG రోడ్ లోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నా లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని, కేంద్రంలోని బి జే పి ప్రభుత్వం జాతిపిత మహాత్మాగాంధీ గారి పట్ల చూపిస్తున్న వివక్షను, ద్వేషాన్ని ఖండించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనే దురుద్దేశంతో ఉందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కనీస పని దినాలు కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇంతకుముందు ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉందని, నేడు బిజెపి ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే దురుద్దేశంతో ఈ పథకంలో మార్పులు చేపట్టిందని, అలాగే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ గారి పేరు కూడా తొలగించాలని చూస్తుందని, కావున ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, పీసీసీ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలలో జరిగిన ధర్నాలు రేపు గ్రామస్థాయి వరకు విస్తరిస్తాయని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి పాత పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

 ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సికింద్రాబాద్, సనత్ నగర్ ఇంఛార్జ్ లు ఆదం సంతోష్ కుమార్,కోట నీలిమ మరియు కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
రఘురామకృష్ణం రాజు కస్టడీయల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ అరెస్ట్
🚨*Big Breaking News * 🚨   *రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం..!*...
By Rajini Kumari 2026-02-23 10:38:32 0 115
Andhra Pradesh
చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య: రోజా
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్...
By Pagadala Venkateswar 2026-01-06 07:35:25 0 192
Telangana
"జీరో పొల్యూషన్ వరకు పోరాటం ఆగదు” : ఎం.పి. ఈటెల.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని,...
By Sidhu Maroju 2026-05-22 12:20:31 0 65
Andhra Pradesh
దావోస్స్ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన వసంత కృష్ణ ప్రసాద్
దావోస్ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేటి ఉదయం ఉండవల్లికి...
By Rajini Kumari 2026-01-23 12:09:47 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com