జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేస్తే ఊరుకోం.|

0
129

 

 

 సికింద్రాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీ వికామిషన్ - గ్రామీణ్ ( వీబీ - జీ - రామ్ - జీ) పేరుతో బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టడాన్ని,ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ DCC అధ్యక్షులు దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ MG రోడ్ లోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నా లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని, కేంద్రంలోని బి జే పి ప్రభుత్వం జాతిపిత మహాత్మాగాంధీ గారి పట్ల చూపిస్తున్న వివక్షను, ద్వేషాన్ని ఖండించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనే దురుద్దేశంతో ఉందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కనీస పని దినాలు కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇంతకుముందు ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉందని, నేడు బిజెపి ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే దురుద్దేశంతో ఈ పథకంలో మార్పులు చేపట్టిందని, అలాగే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ గారి పేరు కూడా తొలగించాలని చూస్తుందని, కావున ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, పీసీసీ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలలో జరిగిన ధర్నాలు రేపు గ్రామస్థాయి వరకు విస్తరిస్తాయని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి పాత పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

 ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సికింద్రాబాద్, సనత్ నగర్ ఇంఛార్జ్ లు ఆదం సంతోష్ కుమార్,కోట నీలిమ మరియు కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
By Pagadala Venkateswar 2026-01-27 09:08:53 0 53
Andhra Pradesh
జిల్లాలు డివిజన్లు మండలాలు పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష
*For Scrolls*   *అమరావతి*   *జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు,...
By Rajini Kumari 2025-12-27 10:43:30 0 111
Andhra Pradesh
వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక
వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక శ్రీనీలకంఠ గారికి జిల్లా కార్యదర్శి టీ కే బందే...
By mahaboob basha 2025-07-07 14:00:33 0 1K
Andhra Pradesh
పశ్చిమ వాడవాడల్లో జగనన్న జన్మదిన వేడుకలు
విజయవాడ 21-12-2025   ప్రచురణార్ధం   *పశ్చిమలో వాడ వాడ ల జగనన్న జన్మదిన వేడుకలు*...
By Rajini Kumari 2025-12-21 12:20:53 0 130
Andhra Pradesh
సోమల లో హిందూ సమ్మేళనం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వక్తలు హైందవ ధర్మాన్ని...
By Kothuru Murali 2026-01-04 11:04:19 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com