హిందూ స్మశాన వాటికను కాపాడండి - కాలనీవాసుల మొర.|

0
248

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : ఆల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో నూతనంగా ఏర్పాటు అయిన 190 డివిజన్ లో గతంలో హిందూ స్మశానవాటిక గురించి తుర్కపల్లి బంధం బావి వద్ద సర్వే నంబర్ 8 లో సుమారు 2.38 ac (రెండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు) హిందూ స్మశానవాటికను తుర్కపల్లి, బంధం బావి, పెన్షన్ పుర, బుడగ జంగాల కాలనీ వాసులకోసం ఏర్పాటు చేశారు.ఇప్పుడు ఈ స్మశాన వాటికలో దాదాపు 1.38 ac (ఎకరా ముప్పై ఎనిమిది గుంటలు) ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. మిగితా ఎకరం కూడా అణ్యాక్రాంత మవుతోంది. కనీసం వున్న ఈ కాస్త భూమినైనా కాపాడాలని కాలనీల వాసులు డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా దీనిపై రాజకీయ నాయకులకు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న పలితం లేదని వాపోయారు. వున్న స్మశాన వాటికలో అంత్యక్రియలు అయిన తర్వాత కనీసం శుభ్రపరుచు కోవడానికి నీటి వసతి కూడా లేదని తెలిపారు. 

ఇప్పటి కైనా అధికారులు స్పందించి ఒక బోరు నీటి సౌకర్యంతో పాటు, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి కనీస వసతులను కల్పిస్తూ, ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

ఈ ధర్నా కార్యక్రమంలో.. మహేష్, సూర్యకుమార్, కొలపురం నర్సంగ్రావు, చంద్ర కుమార్, భాస్కర్, బాలయ్య, బలరాం,శోభన్ బాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య.
మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-01-19 07:11:03 0 196
Andhra Pradesh
ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ స్ట్ర గుల్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా
పత్రికా ప్రకటన! ఏపీ.కాంట్రాక్టుస్టాఫ్ నర్స్ లకు వారంతపు సెలవులు ఇవ్వాల్సిందే --- ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2025-12-16 07:19:47 0 190
SURAKSHA
శీర్షిక: ప్రజలతో మమేకమవుతున్న తెలంగాణ పోలీసులు - కమ్యూనిటీ పోలీసింగ్
తెలంగాణ పోలీసుల ప్రధాన లక్ష్యం ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం. ఈ క్రమంలో, పోలీస్ అధికారులు...
By Kalaga Sailaja 2026-07-01 07:24:53 0 81
Business & Finance
Trademark Opposition: Defend Your Brand Registration
Trademark opposition is a legal process where a third party challenges the registration of a...
By Navya Sree 2026-07-10 05:57:09 0 60
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు...
By Pagadala Venkateswar 2026-04-02 06:17:42 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com