హిందూ స్మశాన వాటికను కాపాడండి - కాలనీవాసుల మొర.|

0
205

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : ఆల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో నూతనంగా ఏర్పాటు అయిన 190 డివిజన్ లో గతంలో హిందూ స్మశానవాటిక గురించి తుర్కపల్లి బంధం బావి వద్ద సర్వే నంబర్ 8 లో సుమారు 2.38 ac (రెండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు) హిందూ స్మశానవాటికను తుర్కపల్లి, బంధం బావి, పెన్షన్ పుర, బుడగ జంగాల కాలనీ వాసులకోసం ఏర్పాటు చేశారు.ఇప్పుడు ఈ స్మశాన వాటికలో దాదాపు 1.38 ac (ఎకరా ముప్పై ఎనిమిది గుంటలు) ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. మిగితా ఎకరం కూడా అణ్యాక్రాంత మవుతోంది. కనీసం వున్న ఈ కాస్త భూమినైనా కాపాడాలని కాలనీల వాసులు డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా దీనిపై రాజకీయ నాయకులకు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న పలితం లేదని వాపోయారు. వున్న స్మశాన వాటికలో అంత్యక్రియలు అయిన తర్వాత కనీసం శుభ్రపరుచు కోవడానికి నీటి వసతి కూడా లేదని తెలిపారు. 

ఇప్పటి కైనా అధికారులు స్పందించి ఒక బోరు నీటి సౌకర్యంతో పాటు, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి కనీస వసతులను కల్పిస్తూ, ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

ఈ ధర్నా కార్యక్రమంలో.. మహేష్, సూర్యకుమార్, కొలపురం నర్సంగ్రావు, చంద్ర కుమార్, భాస్కర్, బాలయ్య, బలరాం,శోభన్ బాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
గొల్లపల్లి దాడితల్లి సిరిమాను చెట్టు కొట్టిన బేబినాయన
గొల్లపల్లి దాడితల్లి గ్రామ దేవత పండగ ఏప్రిల్ 26, 27, 28న జరగనుంది. ఈ నేపథ్యంలో సిరిమనోత్సవానికి...
By Boiena Rajesh 2026-03-29 23:08:14 0 151
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్
రాయచోటి రూరల్ మండలం చిన్న ముక్క పల్లి గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో...
By Benguluri Madhubabu 2026-02-28 02:32:42 0 226
Andhra Pradesh
AMCA PROJECT in Puttaparthi
రాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర.  ఉద్యాన సీమ... ఇది వర్తమానం.  రక్షణ సీమ... ఇది...
By G k Nookala 2026-05-15 03:37:12 0 71
Andhra Pradesh
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. బొబ్బిలి మండలం అలజంగి,...
By Boiena Rajesh 2026-04-19 05:10:57 0 101
Telangana
నిజామాబాద్: బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ జాద్ ను పరమార్షిన్చినా మజి ఎమ్మెల్యే
నిజామాబాద్:ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్న BRS పార్టీ మైనారిటీ నగర అధ్యక్షుడు ఇమ్రాన్ షెహజాద్...
By Sadaq Sadaq 2026-04-22 16:20:44 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com