గుడివాడలో పర్యటించిన ఎమ్మెల్యే రాము

0
176

*కూటమి ప్రభుత్వ పాలనలో.... గుడివాడలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*గుడ్లవల్లేరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రాము....*

 

*రూ.1.06 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు... ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే*

 

*పెంజేండ్రలో సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీల్లో విజేతలకు...బహుమతులను అందించిన ఎమ్మెల్యే రాము*

 

*గుడివాడకు సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లు... గ్రామాల్లో సంబరాలు జరుగుతున్నాయి*

 

గుడ్లవల్లేరు 12:రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన దిగ్విజయంగా ముందుకు సాగుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.రోడ్లు,త్రాగునీరు, రైతాంగం ఇలా అనేక వ్యవస్థల్లో.... గుడివాడలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చామని అన్నారు.

 

 

గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే వెనిగండ్ల సోమవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా రూ. 53 లక్షల సమగ్ర శిక్ష నిధులతో గుడ్లవల్లేరు పంచాయతీ కార్యాలయ సమావేశ మందిర నిర్మాణానికి, చిత్రం గ్రామంలో రూ.34.50 నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రాము శంకుస్థాపన చేశారు. 

 

అనంతరం మండలంలోని పేంజెండ్ర గ్రామంలో రూ.19 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న సిసి రోడ్డును ప్రారంభించి.... గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన ముగ్గులు పోటీల్లో విజేతలకు బహుమతులను అందించారు.

 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.... కొత్త సంవత్సరంలో గుడివాడ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ముఖ్యంగా భావోద్వేగంతో కూడుకున్న సమస్యల పరిష్కారానికి, గ్రామాల్లో, కాలనీల్లో దశాబ్దాలుగా అపరిస్కృతంగా ఉన్న ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగుతూ గుడివాడ అభివృద్ధి సాధించుకుందాం అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం గుడివాడ అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే రాము అన్నారు.

 

 ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, కొండలమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్ ఈడే మోహన్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సాయన పుష్పవతి, వల్లభనేని రంగబాబు, చేకూరు జగన్మోహన్రావు, డీసీ చైర్మన్ పాలేటి ఆంజనేయులు,పోలవరపు వెంకటరావు, వెనిగళ్ళ నాగేశ్వరరావు, వల్లూరుపల్లి వెంకటేశ్వరరావు, సూరపనేని పరంధామయ్య, చాపరాల బాలాజీ, రాజా, బొల్లా శివ, సాయి, దాసరి మల్లి, సత్యనారాయణ, జనసేన నాయకులు చలంకుర్తి వెంకటేష్, పోలగాని సతీష్, కొడాలి రామరాజు,పామర్తి సత్తిబాబు, తోట మల్లికార్జునరావు, పెన్నేరు రమేష్, కాగిత నరేంద్ర, నరసింహారావు, బెల్లంకొండ ఏడుకొండలు, దివ్య చౌదరి,కల్యాణవపు నవాబు, బుల్ల కింగ్, అబ్దుల్ సత్తార్, బొర్రా ధనకోటి,MEO గోపాలరావు,MPDO ఇమ్రాన్, MEO G. జగన్మోహన్ రావు, APC కొముదిని సింగ్,MPDO ఇమ్రాన్,AE RWS రూపేష్ AE PR నాగేశ్వరరావు, AE డ్రైనేజ్ కుమార్, AE హౌసింగ్ సురేంద్ర,*పెంజేండ్ర గ్రామ నాయకులు* : బొప్పన శివప్రసాద్,గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గూడపాటి వెంకటేశ్వరరావు, రేమల్లి పెంటయ్య, జయ ప్రకాష్, గూడపాటి సూర్యుడు, జఫ్రూలా ఖాన్, ఇమ్రాన్, కరీం, జుక్కుల నాగరాజు,*చిత్రం గ్రామ నాయకులు* పార్టీ ప్రెసిడెంట్ మల్లా వెంకట రామారావు, గోపూ సాంబశివరావు, పాగోలు శ్యామ్ బాబు, బొప్ప సత్యనారాయణ, సందీప్ శామ్యూల్, నాని,

ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల జిల్లా: ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా...
By Gadiyapudi Narendra 2026-03-17 11:50:35 0 453
Andhra Pradesh
వక్ఫ్ బోర్డు చైర్మన్‌కు వినతిపత్రం అందజేసిన ముస్లిం సంఘాల నాయకులు అబ్దుల్ కలాం, నాగుల్ మీరా, నూర్ ఖాన్.
అంజుమన్-ఎ-ఇస్లామియా, గుంటూరు సంస్థకు చెందిన నోటిఫై చేసిన వక్ఫ్ భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరిట...
By John Baji 2026-01-02 02:35:53 0 167
Andhra Pradesh
ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా భావిస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన LOC లేఖలను కడప ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా భావిస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన LOC లేఖలను కడప...
By Chennaiah Kati 2026-07-10 06:13:05 0 60
Telangana
Hearing on MLA Disqualification Petitions to Conclude Today
  ​Hyderabad: The hearing on the disqualification petitions filed against MLAs following...
By G k Nookala 2026-03-05 09:58:33 0 279
Andhra Pradesh
కేబుల్ మెడకు తగిలి ప్రధాన ఉపాధ్యాయుడు మృతి చీరాల మండలంలో విషాద ఘటన
చీరాల: చీరాల మండలం పరిధిలోని దేవి నూతల గవినివారి పాలెం రహదారిపై మంగళవారం ఉదయం ఓ విషాదకర ప్రమాదం...
By Gadiyapudi Narendra 2026-02-11 16:25:12 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com