భార్యను హత్య చేసిన భర్త... ?

0
267

మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్): వివాహిత దారుణంగా హత్యకు గురైన సంఘటన, మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం, ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీ లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతురాలు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బానోత్ రామన్న, స్వప్నలది గతంలో వాళ్ళిద్దరిది ప్రేమ పెళ్లి ముగ్గురు పిల్లలకు తల్లి అయిన తర్వాత, కట్టుకున్న భర్త, బానోత్ రామన్న,  అత్త మామ, మరిది లకు ఆ వివాహిత, ఇష్టం లేకపోవడం తో గతంలో అనేకసార్లు భార్యాభర్తల మధ్య వచ్చిన ఘర్షణలు వచ్చినప్పుడు ఇద్దరు మధ్య సమస్య పరిష్కారం చూపి అత్తగారింటికి పంపించడం జరిగిందని స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి భర్త రామన్న, అత్త బుజ్జి, మామ కిషన్, మరిది నవీన్ లు స్వప్నల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, స్వప్నను తీవ్రంగా కొట్టినట్లు ఆమె శరీర భాగం నుజ్జు నుజ్జు అయిందని, దీంతో స్వప్న అక్కడికక్కడే మృతి నిన్ననీ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకొని స్వప్న మృతి దేహాన్ని మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించినట్లు పేర్కొన్నారు మృతురాలకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు
జనవరి 13, 2026. తాడేపల్లి.   మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ...
By Rajini Kumari 2026-01-13 16:26:56 0 145
Andhra Pradesh
కాఫీ విత్ కబుర్లు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
దేశాన్ని నడిపే సామర్థ్యం కలిగిన నాయకుడు సాధ్యంలో మనం పని చేస్తున్నాము పార్టీ కార్యకర్తలకు గౌరవమే...
By Benguluri Madhubabu 2026-03-25 13:43:04 0 122
Andhra Pradesh
A P news
రేపటి నుంచి ఏపీలోని దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ,...
By G k Nookala 2026-03-17 09:28:28 0 156
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com