104 ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల ధర్నా !!

0
187

కర్నూలు : 
ఆంధ్రప్రదేశ్ 104 MMU ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నేత ఎస్.వి. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, 
వైఎస్ఆర్సిపి కార్మికులకు, ఉద్యోగులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పారు. ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందిస్తున్న 104 MMU ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు.
తగ్గించిన వేతనాలు వెంటనే పునరుద్ధరించాలి, బకాయి వేతనాలను చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, PF, ESI వంటి చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం వైఎస్ఆర్సిపి ఎప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో 104 MMU ఉద్యోగులు, యూనియన్ నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు  పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సూర్యోదయ సంస్థ సేవా స్ఫూర్తి – పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్ల పంపిణీ
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు ప్రభుత్వ హైస్కూల్లో సూర్యోదయ సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి...
By Ratna Sekhar 2026-03-08 17:28:01 0 244
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే...
By John Baji 2026-01-02 12:57:34 0 127
Andhra Pradesh
పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం !!
కర్నూలు : పోలీస్ శాఖ లో క్రమశిక్షణ నే ప్రధానం : కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ : ...
By Hari Krishna 2025-12-23 02:16:31 0 173
Telangana
దుండిగల్ పరిసరాల్లో గ్యాస్ కొరత ! హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం
దుండిగల్ (Dundigal) మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది....
By Ponnala Srinivasrao 2026-03-15 03:58:21 0 176
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com