భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టాడు.. ఆ తర్వాత.. ఉలిక్కిపడిన వరంగల్

0
208

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు.. తన భార్య హత్యకు కారణాలపై డెత్ డిక్లరేషన్ ఇచ్చి తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

భార్య వేధిస్తుందని.. చంపి.. ఆ తర్వాత భర్త ఉరివేసుకుని చనిపోయిన ఘటన తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.. ఈ జంట మరణాల ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో జరిగింది. బాలాజీ రామాచారి అనేవ్యక్తి తన బార్య సంధ్య ను తాడుతో ఉరిబిగించి హత్య చేశాడు.. తన భార్యను హత్య చేయడానికి కారణాలన్నీ వీడియో రికార్డ్ చేసి పోలీసులకు మర్డర్ డిక్లరేషన్ ఇచ్చాడు.. తన భార్య వేధింపులు భరించలేకే హత్య చేసినట్లు వీడియో ద్వారా డిక్లరేషన్ ఇచ్చిన బాలాజీ రామాచారి.. తాను కూడా అదే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మొదటి భార్య మరణానంతరం బాలాజీరామాచారి సంధ్య అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనను భార్య వేధింపులకు గురి చేస్తుందని, ఆ వేధింపులు భరించలేక భార్యను చంపినట్లు తెలిపాడు.. అనంతరం వీడియో తీసి స్టేటస్ పెట్టుకున్నాడు.

భార్య భర్తల మరణంతో.. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ఇద్దరి మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.. ఈఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

#SivaNagendra

Like
1
Search
Categories
Read More
Telangana
Strict Action for Violation of Election Code: District SP Smt. Sneha Mehra, IPS*
In view of the Municipal Elections in the four municipalities of Vikarabad District, the District...
By Terli Ashok 2026-01-31 05:16:24 0 128
Andhra Pradesh
గుంటూరు జిల్లాశ్రీ ఎస్పీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు విద్యార్థులను కాపాడటమే లక్ష్యంగా సంకల్పం కార్యక్రమం కేఎల్ యూనివర్సిటీ లో నిర్వహించారు.
గుంటూరు  జిల్లా పోలీస్...* *తేది: 30.12.2025* _*//డ్రగ్స్ బారినుండి విద్యార్థులను కాపాడటమే...
By KOTESWARARAO KVSR 2025-12-30 12:06:46 0 160
Andhra Pradesh
పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రాజెక్టుల్ని ప్రోత్సహించాలి అంటూ  కేంద్ర ఆరోగ్య,
పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రాజెక్టుల్ని ప్రోత్సహించాలి అంటూ...
By SivaNagendra Annapareddy 2025-12-28 05:12:49 0 238
Andhra Pradesh
రేపు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం.
AP: గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జనవరి 25న మధ్యాహ్నం టీడీపీ పార్లమెంటరీ పార్టీ...
By Pagadala Venkateswar 2026-01-24 06:27:36 0 57
Andhra Pradesh
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-01-05 11:47:01 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com