లోక్ అదాలత్ లో 200746 కేసుల పరిష్కారం

0
274

కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే 2,00,746 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ 52.56 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథాయ్, హైకోర్టు న్యాయసేవల కమిటీ అధ్యక్షులు జస్టిస్ ఎన్.రవినాథ్ తిల్హరి మార్గదర్శకంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దిగువ న్యాయస్థానాల్లో 431 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. ఇరువర్గాల ఆమోదంతో రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్లో న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ వై. లక్ష్మణరావు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న 150 కేసులు పరిష్కరించి రూ 2.81 కోట్ల పరిహారం అందజేశారు. లోక్ అదాలత్ లు విజయవంతమవడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులకు న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి బీఎస్పీ హిమబిందు, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి కృతఙ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్లు ఇలా తీసుకోండి!
AP: నేటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి...
By Pagadala Venkateswar 2026-03-18 03:06:58 0 130
Andhra Pradesh
TG Bharat: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్.
తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు....
By Pagadala Venkateswar 2026-01-31 10:39:59 0 304
Telangana
బాల్య వివాహం ఆపండి
గ్రామం మండలం: జర సంఘం విలేజ్ లో scop ngo. ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో బాల్య వివాహం నిషేధం అని...
By Alige Srinivas 2026-03-04 09:52:51 0 440
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com