రాజధాని కార్మిక వాడల్లో డిసెంబర్ 15న ఎర్రజెండాల ఆవిష్కరణ

0
154

*ఉండవల్లిలో మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి శనివారం నాడు మాట్లాడుతున్న సిఐటియు గుంటూరు జిల్లా నాయకులు ఎం రవి* 

 

*రాజధాని కార్మిక వాడల్లో డిసెంబర్ 15 న*

 *ఎర్రజెండాల ఆవిష్కరణ*

 

*సిఐటియు 18వఅఖిలభారత* *మహాసభ లసందర్భంగా* 

*15న కార్మిక* *వాడల్లో సిఐటియు జెండాలు ఆవిష్కరించవలసిందిగా సిఐటియు రాజధాని కమిటీ పిలుపు*

 

*డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు*

 

*జనవరి 4న కార్మిక మహా ర్యాలీ, బహిరంగ సభ* 

 

ఈ సందర్భంగా సిఐటియు నేత ఎం రవి మాట్లాడుతూ సిఐటియు 18 అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్నాయని అన్నారు 

 

ఈ సందర్భంగా జనవరి 4వ తేదీన విశాఖపట్నంలో లక్షలాదిమంది కార్మికులతో మహా ర్యాలీ జరుగుతుందని, అనంతరం బహిరంగ సభ జరుగుతుందని అన్నారు 

 

ఈ మహాసభల నేపథ్యంలో రాజధాని లోని కార్మిక వాడల్లో డిసెంబర్ 15వ తేదీన సిఐటియు పతాకాల ఆవిష్కరణను చేపడుతున్నట్లుగా తెలిపారు 

 

నాలుగో తేదీన విశాఖలో జరగనున్న కార్మిక ర్యాలీలో రాజధాని ప్రాంతంలోని అన్ని రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రవి కోరారు

 

కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 

లేబర్ కోడుల పేరుతో కాలరాచి వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు

 

లేబర్ కోడ్ ల వలన కార్మికుల కుపని భద్రత ఉండదని అన్నారు

 

కార్మికులు కార్పొరేట్లకు ఎట్టి చాకిరీ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అన్నారు

 

 కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను ఉపసంహరించుకునే వరకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన లకు సిద్ధం కావాలని కోరారు 

 

క్రిస్మస్ పండుగ నాటికైనా గత జులై నెల మున్సిపల్ కార్మికులసమ్మె కాలపు వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు చెల్లించాలని కోరారు 

 

ఎంటిఎంసీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు సబ్బులు, నూనెలు, మాస్కులు, గ్లౌజులు, యూనిఫామ్, చెప్పులు, ఐడి కార్డ్ ,రక్షణ పరికరాలు అందజేయాలని రవి డిమాండ్ చేశారు

 

ఈ కార్యక్రమంలో రాజధాని ప్రాంత మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఏ శాంతకుమారి టి బాబు యూనియన్ నాయకులు ఆర్ వేణు ఆవుల నారాయణ స్వర్ణకుమారి మేరీ స్వరూప కుశాల రావు సుందర్ రావు సిఐటియు నాయకులు వి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Odisha
Odisha Speaker Holds All-Party Meet Ahead of Monsoon Session |
Odisha Legislative Assembly Speaker Surama Padhy convened an all-party meeting to discuss the...
By Pooja Patil 2025-09-16 06:35:26 0 124
Andhra Pradesh
కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం !
కర్నూలు : స్వచ్ఛ నగర సాకారానికి కీలక అడుగులు!! కర్నూలును స్వచ్ఛ నగరంగా సాకారం చేయాలనే...
By Hari Krishna 2025-12-14 10:12:16 0 225
Andhra Pradesh
శ్రీరామ్ చినబాబు మల్లయ్యకొండ ఆలయంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్యకొండ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి...
By Pagadala Venkateswar 2026-02-16 05:00:45 0 26
Andaman & Nikobar Islands
A&N Administration launches Online Services on National Single Window System to enhance ‘Ease of Doing Business’
 A&N Administration has made thirty essential Government services available exclusively...
By Bharat Aawaz 2025-06-25 11:51:15 0 2K
Andaman & Nikobar Islands
ICG Rescues Foreign Crew from Stranded Yacht Near Nicobar Islands
 The Indian Coast Guard (ICG) successfully rescued two foreign nationals—a citizen of...
By Bharat Aawaz 2025-07-17 08:10:25 0 985
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com