కర్నూలు కి తొందరలో తుంగభద్ర నీటి సరఫరా నిలిపివేత?

0
424

 

కర్నూలు !! వచ్చే ఏడాది జనవరి 10 తర్వాత తుంగభద్ర నది ద్వారా అందే నీటి పారుదల నిలిపివేయనున్న నేపథ్యంలో నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు వెంటనే తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఇంజనీరింగ్ విభాగం, అమెనిటీస్ విభాగం, తాగునీటి విభాగ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుంగభద్ర నీటి నిలుపేత అనంతరం వేసవి కాలంలో నగరానికి అవసరమైన నీటి సరఫరా నిరాటంకంగా కొనసాగించేందుకు ట్యాంకుల శుభ్రపరిచే పనులు, ప్రత్యామ్నాయ బోర్లు, మోటారుల మరమ్మతులు, పవర్ బోర్ల వినియోగం, ట్యాంకర్ సప్లై వంటి చర్యలను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో లీకేజీలను పూర్తిగా నియంత్రించి, పైపులైన్ మరమ్మతులను రోజువారీగా పర్యవేక్షించాలన్నారు.

Like
3
Search
Categories
Read More
Telangana
BCలకు 42% సీట్లు.. పార్టీలు అమలు చేస్తాయా?
BCలకు 42% సీట్లు.. పార్టీలు అమలు చేస్తాయా? తెలంగాణ : సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల...
By Pinnehasan Odela 2026-01-15 14:21:50 0 174
Andhra Pradesh
అయ్యప్ప స్వామి దర్శించుకున్న జడ్పీ చైర్మన్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారి పల్లి కోటమలై అయ్యప్ప స్వామి...
By Kothuru Murali 2026-01-11 08:19:17 0 106
Andhra Pradesh
లేబర్ కోడ్స్ రద్దు చేయాలని నిరసన కేంద్రమంత్రి లేబర్ అధికారులకు వినతి
లేబర్స్ కొడ్స్ రద్దు చేయాలని నిరసన   కేంద్ర మంత్రి, లేబర్ అధికారులకు వినతి  ...
By Rajini Kumari 2026-01-28 12:56:45 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com