కర్నూలు కి తొందరలో తుంగభద్ర నీటి సరఫరా నిలిపివేత?

0
426

 

కర్నూలు !! వచ్చే ఏడాది జనవరి 10 తర్వాత తుంగభద్ర నది ద్వారా అందే నీటి పారుదల నిలిపివేయనున్న నేపథ్యంలో నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు వెంటనే తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఇంజనీరింగ్ విభాగం, అమెనిటీస్ విభాగం, తాగునీటి విభాగ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుంగభద్ర నీటి నిలుపేత అనంతరం వేసవి కాలంలో నగరానికి అవసరమైన నీటి సరఫరా నిరాటంకంగా కొనసాగించేందుకు ట్యాంకుల శుభ్రపరిచే పనులు, ప్రత్యామ్నాయ బోర్లు, మోటారుల మరమ్మతులు, పవర్ బోర్ల వినియోగం, ట్యాంకర్ సప్లై వంటి చర్యలను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో లీకేజీలను పూర్తిగా నియంత్రించి, పైపులైన్ మరమ్మతులను రోజువారీగా పర్యవేక్షించాలన్నారు.

Like
3
Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలంపెద్ద దోర్నాల. అక్రమ అరెస్టులను ఖండించండి.అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000/- ఇవ్వాలి,* *- సిఐటియు డిమాండ్...*
మార్కాపురం జిల్లా దోర్నాల మండల                 ...
By Chennaiah Kati 2026-03-03 13:03:48 0 141
Andhra Pradesh
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: JC
ఈ నెల 26న మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో జరిగే 77వ భారత గణతంత్ర దినోత్సవ...
By Pagadala Venkateswar 2026-01-23 06:49:03 0 100
Andhra Pradesh
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో విషాద ఘటన
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన...   పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం...
By Rajini Kumari 2025-12-23 10:06:39 0 129
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై చిన్నారులకు పోలియో చుక్కలు
ప్రెస్ నోట్ విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి...
By Rajini Kumari 2025-12-22 08:20:13 0 177
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com