కర్నూలు కి తొందరలో తుంగభద్ర నీటి సరఫరా నిలిపివేత?

0
425

 

కర్నూలు !! వచ్చే ఏడాది జనవరి 10 తర్వాత తుంగభద్ర నది ద్వారా అందే నీటి పారుదల నిలిపివేయనున్న నేపథ్యంలో నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు వెంటనే తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఇంజనీరింగ్ విభాగం, అమెనిటీస్ విభాగం, తాగునీటి విభాగ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుంగభద్ర నీటి నిలుపేత అనంతరం వేసవి కాలంలో నగరానికి అవసరమైన నీటి సరఫరా నిరాటంకంగా కొనసాగించేందుకు ట్యాంకుల శుభ్రపరిచే పనులు, ప్రత్యామ్నాయ బోర్లు, మోటారుల మరమ్మతులు, పవర్ బోర్ల వినియోగం, ట్యాంకర్ సప్లై వంటి చర్యలను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో లీకేజీలను పూర్తిగా నియంత్రించి, పైపులైన్ మరమ్మతులను రోజువారీగా పర్యవేక్షించాలన్నారు.

Like
3
Search
Categories
Read More
Andhra Pradesh
గంగమ్మ గుడి పక్కన బాత్రూమ్ నిర్మాణంపై నివాసుల అభ్యంతరం.
మదనపల్లె చలపతిరావు కాలనీలో గంగమ్మ గుడికి ఆనుకుని మున్సిపల్ బాత్రూములు నిర్మించడాన్ని కాలనీ...
By Pagadala Venkateswar 2026-03-09 09:08:27 0 83
Andhra Pradesh
Pharm.D I Year (R17) Regular & Supplementary Examinations, September/October 2025 Results Link Below !!!!
Pharm.D I Year (R17) Regular & Supplementary Examinations, September/October 2025 Results...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:15:44 0 142
Andhra Pradesh
డ్రైనేజీ మురికి నీటితో నిత్యం దర్శనం ఇస్తున్న గ్రామం... ఈ సమస్య తీరేది ఎప్పుడు - ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ మేజర్ పంచాయతీ పరిధిలో నేషనల్...
By BABJI DADALA 2025-12-24 06:27:10 0 301
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com