కర్నూలు కి తొందరలో తుంగభద్ర నీటి సరఫరా నిలిపివేత?

0
452

 

కర్నూలు !! వచ్చే ఏడాది జనవరి 10 తర్వాత తుంగభద్ర నది ద్వారా అందే నీటి పారుదల నిలిపివేయనున్న నేపథ్యంలో నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు వెంటనే తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఇంజనీరింగ్ విభాగం, అమెనిటీస్ విభాగం, తాగునీటి విభాగ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుంగభద్ర నీటి నిలుపేత అనంతరం వేసవి కాలంలో నగరానికి అవసరమైన నీటి సరఫరా నిరాటంకంగా కొనసాగించేందుకు ట్యాంకుల శుభ్రపరిచే పనులు, ప్రత్యామ్నాయ బోర్లు, మోటారుల మరమ్మతులు, పవర్ బోర్ల వినియోగం, ట్యాంకర్ సప్లై వంటి చర్యలను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో లీకేజీలను పూర్తిగా నియంత్రించి, పైపులైన్ మరమ్మతులను రోజువారీగా పర్యవేక్షించాలన్నారు.

Like
3
Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-02 11:18:18 0 114
Telangana
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....'అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు,
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....' అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి...
By Ponnala Srinivasrao 2026-03-16 11:07:20 0 218
Telangana
ప్రమాదవకరంగా ఏర్పడ్డ రాళ్లగుట్ట : పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
    సికింద్రాబాద్ : మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్ పల్లి వడ్డెర బస్తి ప్రాంతంలో...
By Sidhu Maroju 2025-11-03 12:25:31 0 216
Andhra Pradesh
*రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశాన్ని జయప్రదం చేయాలి.... రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
ఈనెల 19 వ తేదీన బాపట్ల పట్టణంలోని శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-04-17 08:30:08 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com